Gaddar: గద్దర్ మృతిపై సీపీఐ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల

నగ్జల్బరీ, శ్రీకాకుళం పోరాటాల ప్రేరణతో తెలంగాణలో భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేశారని పేర్కొన్నారు.

Gaddar: గద్దర్ మృతిపై సీపీఐ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల

Gaddar

Gaddar – Maoist party: ప్రజాగాయకుడు గద్దర్ మృతిపై భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) తెలంగాణ (Telangana) రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ (Jagan) పేరిట ఓ లేఖ విడుదలైంది. గద్దర్ మరణం రాష్ట్ర ప్రజలందరికి ఆవేదనను కలిగించిందని అందులో పేర్కొన్నారు.

” గద్దర్ అంటే దేశంలో, రాష్ట్రంలో తెలియని వారు ఉండరు. ఆయన మరణం మమ్మల్ని తీవ్రంగా బాధకు గురి చేసింది. ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నాం. ఆయన కుటుంబానికి మా సానుభూతి తెలియజేస్తున్నాం. నగ్జల్బరీ, శ్రీకాకుళం పోరాటాల ప్రేరణతో తెలంగాణలో భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేశారు.

పాటలు, నాటికలు, బుర్ర కథలు, ఒగ్గు కథల ద్వారా పీడిత ప్రజలను చైతన్య పరిచారు. జన నాట్యమండలి ఏర్పాటులో గద్దర్ కృషి ఉంది. 1972 నుంచి గద్దర్ విప్లవ ప్రస్థానం మొదలై 2012 వరకు కొనసాగింది. 4 దశబ్దాలు పీడిత ప్రజల ప్రక్షాన నిలబడ్డారు. 1972 నుంచి 2012 మావోయిస్టు పార్టీ సభ్యుడిగా కొనసాగారు.

మలి దశ ఉద్యమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడిగా పని చేశారు. దోపిడీ పాలకుల ఎన్‌కౌంటర్లలో, బూటకపు ఎన్‌కౌంటర్లలో మరణించిన విప్లవ కారుల శవాలను తమ కుటుంబాలకు చేరకుండా చేసిన సందర్భంలో శవాల స్వాధీన ఉద్యమానికి నాయకత్వం వహించారు. 1997లో గద్దర్ పై కూడా నల్లదండు ముఠా, పోలీసులు కలిసి కాల్పులు జరిపారు. 5 తూటాలు శారీరంలో దూసుకెళ్లి ప్రాణ ప్రాయ స్థితి నుంచి బయట పడ్డారు.

గద్దర్ చివరి కాలంలో పార్టీ నింబంధనావళికి విరుద్ధంగా పాలక పార్టీలతో కలవడంతో మా పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. దీనితో 2012లో పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దాన్ని మా పార్టీ ఆమోదించింది. 2012 వరకు పీడిత ప్రజల పక్షాన నిలిచిన గద్దర్ ఆ తరువాత బూర్జువా పార్లమెంట్ మార్గాన్ని ఎంచుకున్నారు ” అని లేఖలో పేర్కొన్నారు.

Gaddar: 1997లో గద్దర్‌పై హత్యాయత్నం.. దేశ వ్యాప్తంగా సంచలనం