Raj Gopal Reddy: నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసింది వీరిద్దరే: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ప్రాజెక్టులు పూర్తి చేయకుండా పది సంవత్సరాల తర్వాత ఏ ముఖం పెట్టుకొని కేసీఆర్ నల్గొండకు వస్తున్నారో సమాధానం చెప్పాలని..

Raj Gopal Reddy: నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసింది వీరిద్దరే: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Komatireddy Rajagopal Reddy

నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసింది మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డినే అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా చండూరులో రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

నల్గొండలో జరిగే కేసీఆర్ బహిరంగ సభను పార్టీలకు అతీతంగా బహిష్కరించాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆనాడు జగన్‌తో స్నేహం చేసి కేఆర్ఎంబీపై సంతకం పెట్టి కేంద్రానికి అప్పజెప్పింది కేసీఆరేనని చెప్పారు. ఇప్పుడు నల్గొండ వచ్చి సభ పెడతానని అంటున్నారని తెలిపారు. 2014లో ముఖ్యమంత్రి హోదాలో ఎస్ఎల్బీసీ కూర్చి వేసుకుని పూర్తిచేస్తా అన్నారని చెప్పారు.

ఆ తర్వాత శివన్నగూడెం పూర్తి చేస్తా అన్నారని రాజగోపాల్ రెడ్డి గుర్తుచేశారు. ప్రాజెక్టులు పూర్తి చేయకుండా పది సంవత్సరాల తర్వాత ఏ ముఖం పెట్టుకొని కేసీఆర్ నల్గొండకు వస్తున్నారో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఇప్పటివరకు ఆయా ప్రాజెక్టుల కింద ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, భూనిర్వాసితులకు న్యాయం జరగలేదని తెలిపారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నుండి దిండి ఎత్తిపోతల పథకానికి ఎక్కడి నుంచి నీళ్లు తీసుకురావాలనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ లేదని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. నార్లాపూర్ నుంచి తీసుకొస్తారా? వట్టెం నుండి తీసుకొస్తారా? ఇంతవరకు డిసైడ్ చేయలేదని చెప్పారు.

Balka Suman: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు నోటీసులు