Mid-day Meal : మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్ధులకు అస్వస్ధత
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం దామరంచ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి సుమారు 15 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు.
Mid-day Meal : కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం దామరంచ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి సుమారు 15 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. శనివారం మధ్యాహ్నం భోజనం చేసిన నలుగురు విద్యార్థులకు వాంతులు కావడంతో వారిని వెంటనే అంబులెన్స్ లో బాన్స్వాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అటు తర్వాత మరికొంత మంది విద్యార్థులు కూడా అనారోగ్యానికి గురికావడంతో వారందరినీ కూడా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం వండటానికి ముందు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వంటకు సంబంధించిన నూనె,కారం, ఇతర వస్తువులు పరిశీలించినట్లు చెప్పారు.
Also Read : Asaram Bapu : జోథ్పూర్ ఎయిమ్స్లో చేరిన ఆశారాం బాపు
విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినడం వల్ల అనారోగ్యానికి గురయ్యారా లేదా బయట నుంచి ఏదైనా తినుబండారాలు తిన్నారా అనే విషయంపై వివరాలు సేకరిస్తున్నట్టు చెప్పారు. విచారణ జరిపిన అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.