Rangareddy Tragedy: మద్యం తాగకూడదని భర్త మందలించిన పాపానికి భార్య అదే మద్యంలో ఎలుకల మందు కలుపుకుని..

కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కిస్మత్ పూర్ గ్రామంలో బెల్టు షాపులు ఎక్కువయ్యాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.

Rangareddy Tragedy: మద్యం తాగకూడదని భర్త మందలించిన పాపానికి భార్య అదే మద్యంలో ఎలుకల మందు కలుపుకుని..

Updated On : August 21, 2025 / 11:45 AM IST

రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్‌, కిస్మత్ పూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. మద్యం తాగకూడదని భర్త మందలించిన పాపానికి భార్య ఆత్మహత్య చేసుకుంది.

నిన్న భార్య అరుణను భర్త శేఖర్ మందలించాడు. దీంతో అరుణ తీవ్రమనస్తాపానికి గురైంది.

Also Read: Telangana Weather Alert: జర భద్రం.. హైదరాబాద్‌ సహా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌.. హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్

భర్త ఇంట్లోలేని సమయంలో మద్యంలో ఎలుకల మందు కలుపుకుని అరుణ తాగింది. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అరుణ చికిత్స పొందుతూ మృతి చెందింది.

కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కిస్మత్ పూర్ గ్రామంలో బెల్టు షాపులు ఎక్కువయ్యాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.