రోడ్డెక్కితే వెహికల్స్ సీజ్.. 7దాటితే మనుషులు కనిపించొద్దు: డీజీపీ

లాక్ డౌన్పై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఆదివారం నిర్వహించిన జనతా కర్ఫ్యూను పొడిగించాలని.. దేశ ప్రజలు లాక్ డౌన్లో పాల్గొనాలని ప్రధాని పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం ప్రజలు వీటిని పట్టించుకోకుండా కనపడటంతో పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఈ మేరకు రోడ్లపైకి వాహనాలు రాకుండా ఉండాలని అత్యవసరమైతేనే రావాలని సూచించారు.
సాయంత్రం 7గంటల నుంచి ఉదయం 6గంటల వరకూ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావడానికి వీల్లేదని ఆదేశిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు అత్యవసరంగా మీడియాతో భేటీ అయిన డీజీపీ మహేందర్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సూచనలు ఇచ్చారు.
* వ్యాధి లక్షణాలున్నా వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.
* రోడ్లపై వచ్చేందుకు బలమైన కారణం ఉండాలి.
* వచ్చే 10-15రోజులు అత్యంత కీలకమైనవి
* ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకపోతే కఠిన చర్యలు తప్పవు.
* పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు రోడ్లపైకి అనుమతుల్లేవ్.
* కారణం లేకుండా బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవు.
* గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు మాత్రమే అనుమతిస్తాం.
* ఐదుగురికి మించి అనుమతులివ్వొద్దు.
* బైక్ మీద ప్రయాణించే వారు ఇద్దరు మాత్రమే వెళ్లాలి. కారులో వెళ్లాలనుకుంటే ఇద్దరికే పర్మిషన్.
* అత్యవసర షాపులు తప్ప అన్నీ బంద్.
* ప్రజలు సహకరించకుండా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు.
తెలంగాణలో ముప్పైకి పైగా కరోనా కేసులునమోదు కావడంతో కఠిన ఆంక్షలు విధించారు. వీలైనంత త్వరగా పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సర్వత్రా అలర్ట్ ప్రకటించారు.
See Also | దేశమంతా షట్ డౌన్.. బయట కనిపిస్తే లోపలెయ్యండి: రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు