గొర్రెలకు హాస్టళ్లు

గొర్రెలకు హాస్టళ్లు

jagityal

Updated On : March 6, 2021 / 10:12 AM IST

sheep hotels : యాదవులు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో తెలంగాణ సర్కార్ కృషి చేస్తోంది. వీరు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు ఇప్పటికే గొర్రెలు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకొంటోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే…గొర్రెల సంరక్షణకు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా…సముద్రలింగాపూర్ లో సకల వసతులతో సామూహిక వసతి గృహాలు నిర్మించింది.

వీటిని త్వరలోనే మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. మంత్రి కేటీఆర్‌ సహకారంతో 42 సామూహిక పాకలను నిర్మించినట్లు, సకల సౌకర్యాలు కల్పించడం జరిగిందని సముద్రలింగాపూర్ సర్పంచ్ మోతె రాజిరెడ్డి వెల్లడించారు. గంభీరావుపేట మండలంలోని సముద్రలింగాపూర్‌లో 43 యాదవ కుటుంబాలున్నాయి. ఇక్కడ గొర్రెల హాస్టల్ ను నిర్మించింది. సముద్రాలింగాపూర్‌ -గుండారం రహదారి పక్కన కుల సంఘానికి చెందిన రెండెకరాల పది గుంటల స్థలంలో సామూహిక ఆవాసాలను నిర్మించారు.

ఉపాధి పథకం కింద రూ. 89 లక్షలు వంద శాతం రాయితీపై నిధులు వెచ్చించారు. ఆరు మీటర్ల పొడవు, నాలుగు మీటర్ల వెడల్పు, రెండున్నర మీటర్ల ఎత్తుతో పాకలను నిర్మించారు. ఇందులో 21 గొర్రెలు (20 ఆడ, ఒక మగ) ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇందులో నీటి సౌకర్యం, వసతి, ఎండ, వాన, చలి నుంచి రక్షణకు తగిన చర్యలు చేపట్టారు. సామూహిక వసతి గదులు నిర్మించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది.