బీఆర్ఎస్‌కు భారీ షాక్.. కాంగ్రెస్ లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు

ఇప్పటికే ఎమ్మెల్యేలు పార్టీ వీడుతుండటంతో బీఆర్ఎస్ పరేషాన్ అవుతోంది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు ఎమ్మెల్సీలు సైతం పార్టీకి గుడ్ బై చెప్పడం గులాబీ పార్టీలో గుబులు పెంచింది.

బీఆర్ఎస్‌కు భారీ షాక్.. కాంగ్రెస్ లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు

Big Shock For Brs (Photo Credit : Google)

Big Shock For Brs : బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కారు దిగి హస్తం గూటికి చేరారు. తాజాగా ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చారు. ఏకంగా ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్సీలు దండె విఠల్, భాను ప్రసాద్, ఎగ్గె మల్లేశం, బుగ్గారపు దయానంద్, ప్రభాకర్ రావు, బస్వరాజు సారయ్యలు హస్తం గూటికి చేరారు.

వీరి చేరికలతో శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 12కి పెరిగింది. మండలిలో సభ్యుల సంఖ్య 40. రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు పార్టీ వీడుతుండటంతో బీఆర్ఎస్ పరేషాన్ అవుతోంది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు ఎమ్మెల్సీలు సైతం పార్టీకి గుడ్ బై చెప్పడం గులాబీ పార్టీలో గుబులు పెంచింది. ఇక సీనియర్ నేత కే కేశవరావు సైతం కాంగ్రెస్ లో చేరిపోయారు. అంతేకాదు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.

Also Read : కాంగ్రెస్‌లో కేకే రేపిన తుఫాన్ ఏంటి? వలస నేతలకు వచ్చిన కష్టం ఏంటి?