YS Sharmila: లక్ష కోట్ల రూపాయలు కాజేసిన శక్తులు మీరే: షర్మిల
బంగారు తునకపై 5 లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్ప చేసి పెట్టిన శక్తులు మీరేనని అన్నారు.

YS Sharmila
YS Sharmila – KTR: దొంగే దొంగా దొంగా అన్నట్లుంది మంత్రి కేటీఆర్ తీరు అంటూ వైఎస్సార్టీపీ (YSRTP) అధినేత్రి షర్మిల విమర్శలు గుప్పించారు. విచ్ఛిన్నకర శక్తులను తిప్పికొట్టాలని చెప్పే దొర గారు.. కుటిల యత్నాలతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన అసలైన శక్తులు మీరే కదా? అని నిలదీశారు.
‘ బంగారు తునకపై 5 లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్ప చేసి పెట్టిన శక్తులు మీరే. రాష్ట్రం నెత్తిన అప్పులు మోపి లక్ష కోట్ల రూపాయలు కాజేసిన శక్తులు మీరే. 9 ఏళ్లలో 8 వేల మంది రైతులను, ఉద్యోగాలు అని చెప్పి వందల మంది నిరుద్యోగులను, పొట్టన పెట్టుకున్న అతీత శక్తులు మీరే.
రాష్ట్రం పేరు చెప్పి వేల ఎకరాలు కాజేసిన భూ బకాసుర శక్తి మీరే. తెలంగాణ నినాదాన్ని వక్రీకరించి, నీళ్లను ఫామ్ హౌస్ కి పారించి, నిధులను సొంత అవసరాలకు తరలించి, నియామకాలను కుటుంబానికే ఇచ్చుకున్న బంది పోట్ల రాష్ట్ర సమితినే ఈ రాష్ట్రానికి విచ్ఛిన్నకర శక్తి.
ప్రజల సొమ్ముతో స్వార్థ రాజకీయలు చేస్తూ, ఉజ్వల తెలంగాణ చరిత్రను పూర్తిగా పక్కదారి పట్టించి, ఉద్యమకారులను అణగదొక్కి, తెలంగాణ జీవనాడిని కలుషితం చేసిన మీరే అసలైన అవకాశవాదులు ’ అని షర్మిల అన్నారు.
MS Dhoni: ఆటోగ్రాఫ్ ఇచ్చి చాక్లెట్ తీసుకున్న ధోనీ.. వీడియో వైరల్