రూల్స్కి విరుద్దంగా బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపారు : మంత్రి బుగ్గున
రూల్ 71 అనేది అసలు దేశంలోనే ఎక్కడా లేదని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలోనే రూల్ 71 ఉందన్నారు.
రూల్ 71 అనేది అసలు దేశంలోనే ఎక్కడా లేదని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలోనే రూల్ 71 ఉందన్నారు.
రూల్ 71 అనేది అసలు దేశంలోనే ఎక్కడా లేదని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలోనే రూల్ 71 ఉందన్నారు. ఆ రూల్ కూడా కేవలం ప్రభుత్వం పంపించే బిల్లులపై సమీక్షించేందుకే వినియోగించాలని చెప్పారు. కాని, టీడీపీ మాత్రం రూల్ 71 ఉపయోగించి బిల్లులను అడ్డుకునే ప్రయత్నం చేసిందని విమర్శించారు.
రూల్స్కి విరుద్దంగా బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపారని మంత్రి బుగ్గున విమర్శించారు. సెలక్ట్ కమిటీకి పంపించాలంటే.. మండలిలోకి బిల్లులను అనుమతిస్తున్నప్పుడే మోషన్ మూవ్ చేయాల్సి ఉందన్నారు. కాని, సాయంత్రమే మోషన్ మూవ్ చేశామని.. తప్పుడు తేదీ వేసి.. మండలిని తప్పుదారి పట్టించారని ఆరోపించారు.
వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు మండలిలో బ్రేకులు పడ్డాయి. అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను.. సెలక్ట్ కమిటీకి పంపుతూ మండలి చైర్మన్ షరీఫ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకున్న విచక్షణాదికారాలతో బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపారు. దీంతో మరో మూడు నెలలు రాజధానుల అంశం పెండింగ్లో పడినట్లే. ఈ అంశంపై రోజంతా శాసన మండలిలో ప్రతిష్టంభన ఏర్పడగా.. బిల్లులపై ఓటింగ్ జరపాలని.. అధికారపక్షం.. సెలక్ట్ కమిటీకి పంపాల్సిందేనంటూ ప్రతిపక్షం మండలి చైర్మన్ ముందు తమ వాదనలు వినిపించాయి.
ముందుగా ఈ రెండు బిల్లులపై మండలి చైర్మన్ చర్చ నిర్వహించారు. అందరూ ప్రసంగించిన తర్వాత.. అసలు విషయం తెరపైకి వచ్చింది. బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని ముందుగానే టీడీఎల్పీ నేత యనమల రామకృష్ణుడు నోటీసులు ఇచ్చారు. అయితే అవి సాంకేతికంగా మూవ్ కాలేదని.. చైర్మన్ చెప్పారు. దీంతో సెలక్ట్ కమిటీకి బిల్లును పంపే అధికారం చైర్మన్కు లేదంటూ బిల్లులపై ఓటింగ్ జరపాలని అధికార పార్టీ పట్టుబట్టింది.
అయితే ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సెలెక్ట్ కమిటీకి వెళ్లకూడదని గట్టి పట్టుదలతో ఉన్న వైసీపీ సర్కార్ వ్యూహం మాత్రం చివరకు విఫలం అయ్యింది. సెలెక్ట్ కమిటీలో ఈ బిల్లు ప్రక్రియ ముగియడానికి కనీసం మూడు నెలలు పడుతోంది. అయితే రాజధాని వికేంద్రీకరణ ప్రక్రియను ఆగమేఘాల మీద ముగించాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వంకు చివరకు గట్టి ఎదురుదెబ్బే తగిలినట్లు అయ్యింది. ఛైర్మన్ రూలింగ్ పై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్సీలు ఛైర్మన్ తీరుని తప్పుబట్టారు.