ప్రయాణికులకు షాక్, టికెట్ రిజర్వేషన్లు ఆపేసిన ఏపీ ఆర్టీసీ
ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తే బస్సుల్లో ఊర్లకు వెళ్లిపోవాలని అనుకుంటున్న ప్రయాణికులకు ఏపీ, తెలంగాణ ఆర్టీసీ అధికారులు షాక్ ఇచ్చారు. టికెట్ రిజర్వేషన్లు ఆపేశారు.

ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తే బస్సుల్లో ఊర్లకు వెళ్లిపోవాలని అనుకుంటున్న ప్రయాణికులకు ఏపీ, తెలంగాణ ఆర్టీసీ అధికారులు షాక్ ఇచ్చారు. టికెట్ రిజర్వేషన్లు ఆపేశారు.
ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తే బస్సుల్లో ఊర్లకు వెళ్లిపోవాలని అనుకుంటున్న ప్రయాణికులకు ఏపీ, తెలంగాణ ఆర్టీసీ అధికారులు షాక్ ఇచ్చారు. టికెట్ రిజర్వేషన్లు ఆపేశారు. హైదరాబాద్ సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులకు అడ్వాన్స్డ్ రిజర్వేషన్ ప్రక్రియను ఏపీఎస్ఆర్టీసీ నిలిపివేసింది. తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ సంకేతాలివ్వడంతో ఆర్టీసీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ కొనసాగితే ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న వారికి పూర్తి సొమ్ము వాపసు ఇస్తామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. లాక్డౌన్ తర్వాత రోజు నుంచి వివిధ ప్రాంతాలకు నాన్–ఏసీ బస్సులు నడపాలని నిర్ణయించిన ఆర్టీసీ గత నాలుగు రోజులుగా ఆన్లైన్ రిజర్వేషన్ టిక్కెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచగా 15వ తేదీకి ఫుల్ అయ్యాయి.
6 రోజుల్లో 42వేల 377 టిక్కెట్లు బుకింగ్:
మొత్తం 200 బస్సులకు రిజర్వేషన్ అవకాశం ఇవ్వగా 7 వేల టిక్కెట్లు ప్రయాణికులు కొనుగోలు చేశారు. అయితే తాజాగా లాక్ డౌన్పై ప్రతిష్టంభన నెలకొనడంతో బుధవారం నుంచి ఏపీలోని అన్ని ప్రాంతాలకు రెండు వైపులా బుకింగ్ను ఆపేశారు. లాక్ డౌన్ కొనసాగితే బుకింగ్ చేసుకున్న టిక్కెట్లకు సంబంధించి పూర్తి సొమ్మును వాపసు చేస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ముందుగా ప్రకటించిన ప్రకారం ఏప్రిల్ 14వ తేదీతో లాక్డౌన్ ముగుస్తుంది. దీంతో 15 నుంచి 20వ తేదీ వరకు ఆర్టీసీ టిక్కెట్ల రిజర్వేషన్ను అధికారులు నాలుగు రోజుల క్రితం అందుబాటులోకి తెచ్చారు. ఆరు రోజులకు వివిధ ప్రాంతాలకు కలిపి 42,377 టిక్కెట్లు ఇప్పటికే బుక్ అయ్యాయి.
ఏపీలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 348గా ఉంది. 9మంది కోలుకున్నారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 75మంది కరోనా బాధితులు ఉన్నారు. ఆ తర్వాత 49మంది కరోనా బాధితులతో గుంటూరు జిల్లా సెకండ్ ప్లేస్ లో ఉంది. రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల్లో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు ఎక్కువమంది ఉన్నారు.
Also Read | ఈ 10 రోజులే కరోనాకు కీలకం : మే వరకు లాక్డౌన్ పొడిగించనున్న బ్రిటన్