సాఫ్ట్‌వేర్ శారద కూరగాయలు చోరీ :కరోనా కష్టంలో రూ.5వేలు నష్టం

  • Published By: nagamani ,Published On : July 31, 2020 / 09:48 AM IST
సాఫ్ట్‌వేర్ శారద కూరగాయలు చోరీ :కరోనా కష్టంలో రూ.5వేలు నష్టం

Updated On : July 31, 2020 / 11:19 AM IST

‘సాఫ్ట్‌వేర్ శారద ఈ పేరు అటు ప్రధాన మీడియాలో, ఇటు సోషల్ మీడియాలోనూ ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. కరోనా కష్టాల్లో భాగంగా ‘‘టెకీ శారద’’ కూరగాయల అమ్ముకునే శారదగా మారిపోయిది. ఉద్యోగం పోయినా మనోస్థైర్యం మాత్రం కోల్పోని శారద తన కుటుంబ జీవనాధారం కోసం దారులు వెతికింది. చివరికి హైదరాబాద్, శ్రీనగర్ కాలనీలో ఫుట్‌పాత్‌పై కూరగాయలు అమ్ముకుంటూ జీవిస్తోంది.



ఈ విషయం మీడియా కెక్కి సంచలనమైంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన శారద కూరగాయలు విక్రయిస్తూ డిగ్నిటీ ఆఫ్ లేబర్‌కు ప్రతీకగా నిలిచిందని ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆమె గురించి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నటుడు సోనూసూద్ స్పందించి ఉద్యోగం ఆఫర్ చేశాడు. సోనూ ఆఫర్ తో శారద కష్టాలు గట్టెక్కినట్లేననుకోవచ్చు.

ఇదిలా ఉండగా.. పక్కనపెడితే శారద కూరగాయల దుకాణంలో చోరీ జరిగింది. మంగళవారం రాత్రి కూరగాయలు అమ్మిన తర్వాత మిగతా వాటిని బండిపైనే ఉంచి కవర్‌తో కప్పి రోజూలానే ఇంటికి వెళ్లిపోయింది. ఆ తర్వాతి రోజు దుకాణానికి రాగా..బండిపై ఉండాల్సిన కూరగాయలు మాయమయ్యాయి. మొత్తంగా రూ. 5 వేల విలువైన కూరగాయలు మాయమైనట్టు శారద ఆవేదన వ్యక్తం చేసింది. తన తండ్రి కూరగాయలు అమ్ముతున్నప్పటి నుంచి అక్కడే వదిలేసే వాళ్లమనీ.. ఇలా ఏనాడూ దొంగతనం జరగలేదని శారద వాపోయింది.