వేములవాడ రాజన్న బంగారం : 18 కిలోలు

కరీంగనర్ : దక్షిణ కాశీగా పిలవబడే వేములవాడ శ్రీరాజ రాజేశ్వరస్వామికి భక్తులు సమర్పించిన బంగారాన్ని ఆలయ అధికారులు తూకం వేశారు. దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో ఈ బంగారం మొత్తం 18 కిలోల 360 గ్రాములు వచ్చింది. దీన్ని అధికారులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అందించారు. రాష్ట్రంలోని ఆలయాలకు అందే బంగారాన్ని బ్యాంకుల్లో జమ చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
2009 నుంచి 2015 వరకూ ఆలయానికి బంగారం రూపంలో భక్తులు ఇచ్చిన బహుమతులను ఎస్బీఐ లో జమ చేసినట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు. బంగారం తూకం వేసే ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ వేసిన కమిటీ సభ్యులు అడిషనల్ కమిషనర్, ఇంచార్జీ జాయింట్ కమిషనర్ శ్రీనివాసరావు, జ్యువెలరీ వెరిఫికేషన్ అధికారి అంజన్నదేవీ, ఆలయ ఈవో దూస రాజేశ్వర్ పాల్గొన్నారని ఆయన తెలిపారు.