UP : యూపీ పెళ్లి వేడుకల్లో గిఫ్ట్లుగా బుల్డోజర్లు..ఇవి మహిళల భద్రతకు,యూపీ అభివృద్ధికి గుర్తు అంటున్న మేయర్
యూపీ పెళ్లి వేడుకల్లో గిఫ్ట్లుగా బుల్డోజర్లు ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. దీనిపై ప్రయాగ్ రాజ్ మేయర్ మాట్లాడుతు..బుల్డోజర్లు మహిళల భద్రతకు,యూపీ అభివృద్ధికి గుర్తు అని అన్నారు
bulldozer toys given as gifts in wedding in up : ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల క్రమంలో బీజేపీకి బుల్డోజర్లు ఐకాన్ గా మారిపోయింది. బీజేపీకి ఓటు వేయకపోతే వారి ఇళ్లమీదకు బుల్ డోజర్లు పంపిస్తాం అని..యూపీనుంచి బుల్డోజర్లు తెలంగాణకు వస్తాయి అంటూ తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల జరిగే క్రమంలో పలువురు బీజేపీ నేతలు బుల్డోజర్లు అనే మాట ఉపయోగించిన క్రమంలో బుల్డోజర్ అంటూ బీజేపీకి ఐకాన్ గా మారిపోయాయి. ఈ క్రమంలో యూపీలో మరో ఆసక్తికర విషయం బయటపడింది. యూపీలో జరిగి సామూహిక వివాహ వేడుకల్లో బుల్డోజర్ బొమ్మలు గిఫ్టులుగా ఇచ్చిన వైనం మరోసారి బీజేకీ బుల్డోజర్ కు ఉన్న అవినావభావ సంబంధం వార్తల్లోకొచ్చింది.
Also read : MLA Raja Singh : బీజేపీకి ఓటు వేయకపోతే వారి ఇళ్లమీదకు బుల్ డోజర్లు పంపిస్తాం : ఎమ్మెల్యే రాజాసింగ్
యూపీకి మరోసారి సీఎం అయిన యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలోని యూపీ ప్రభుత్వానికి తాజాగా బుల్డోజర్ ఒక లోగోలా మారింది. మినియేచర్ బుల్డోజర్లను ఇప్పుడు బహుమతులుగా ఇచ్చి పుచ్చుకుంటున్నారు. ప్రయాగ్రాజ్లోని కత్రా ఫంక్షన్ హాల్లో చౌరాసియా కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వివాహాల్లో ఆదివారం (మార్చి 27,2022)9 జంటలు వివాహ బంధంతో ఏకమయ్యాయి. వారికి బుల్డోజర్ టాయ్తో పాటు గృహోపకరణాలు బహుమతులుగా అందచేశారు.
ఈ సందర్భంగా ప్రయాగ్రాజ్ మేయర్ అభిలాష్ గుప్తా ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ‘బుల్డోజర్ మహిళల భద్రతతో పాటు యూపీ అభివృద్ధికి చిహ్నంగా మారాయి’అని అన్నారు. యూపీలో ప్రశాంత వాతావరణం నెలకొల్పినందుకు బుల్డోజర్ బాబాగా యోగీ పేరొందారు అని..అటువంటి యోగి ఆదిత్యానాధ్కు వధువులు ధన్యవాదాలు తెలిపారు.
Also read : Rajasthan : ‘బీజేపీ నేతలు రామ భక్తులు కాదు..రావణాసురుడి భక్తులు : మంత్రి విమర్శలు
కాగా..యోగీ ఆదిత్యానాథ్ తొలిసారి సీఎం అయ్యాక కబ్జాల మాఫియాను అంతం చేయటానికి..నేరస్తుల ఆస్తులను కూలగొట్టటానికి బుల్డోజర్లను ఉపయోగించారు. దీంతో యోగీ బుల్డోజర్ బాబాగా పేరొందారు. అంతేకాదు ఇటీవలిజరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ బుల్డోజర్ల ప్రస్తావన పదే పదే తీసుకొస్తూ ర్యాలీల్లో హోరెత్తించారు. దీంతో విపక్ష నేతలు యోగీని బుల్డోజర్ బాబా అంటూ ఎద్దేవా చేశారు. పలు విమర్శలు చేశారు. కానీ బీజేపీ మాత్రం ఆ విమర్శలనే ఆయుధంగా ఉపయోగించుకుని ప్రచార ర్యాలీల్లోనూ బుల్డోజర్లతో హల్ చల్ చేశారు. అలా ఎలా అయితేనే మరోసారి యూపీలో సీఎంగా యోగీ ఆదిత్యానాథ్ పీఠమెక్కారు.