1లక్షకు చేరువలో : భారత్ లో 24గంటల్లో 5వేలకు పైగా కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు 1 లక్షకు దగ్గరలో ఉన్నాయి. రోజు రోజుకి రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు వస్తున్నాయి. అయితే కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగించేదే అయినా, అదేస్థాయిలో కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరగడం కొంచెం ఊరటనిచ్చే విషయం. అయితే ఇదిలా ఉంటే, ఆదివారం ఒక్కరోజులేనే కరోనా కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 5,224కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని సోమవారం(మే-18,2020)ఉదయం కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశంలో ఒక్క రోజులేనే ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదవడం ఇదే తొలిసారి.
దేశవ్యాప్త 4వ విడత లాక్ డౌన్ కు కేంద్రప్రభుత్వం గైడ్ లైన్స్ ను విడుదల చేసిన కొన్ని గంటల్లోనే భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదవడం జరిగింది. కొన్ని సడలింపులతో మే-31వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ సడలింపుల్లో రాష్ట్రాలకే కొన్ని నిర్ణయాలను వలిదేసింది కేంద్రం. ఆరెంజ్,గ్రీన్ జోన్లలో కార్యకలాపాలకు సంబంధించి రాష్ట్రాలు నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించింది.
ప్రస్తుతం దేశంలో 96,169 మంది కరోనా బారిన పడగా, 36,824 మంది కోలుకున్నారు. 3,029మంది మరణించారు. రికవరీ రేటు 38.29 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం తెలిపింది. దేశంలో ఎక్కవ కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 33వేలు దాటింది. దేశంలో మూడొంతుల కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి.
ఒక్కసారిగా పెరిగిన కేసులు
ఈ నెల 4వ తేదీ నుంచి ఒక్కరోజు (మే 5) తప్ప ఏ రోజూ 3 వేలకు తక్కువగా కేసులు నమోదు కాలేదు. ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 5 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే ఎక్కువ. అంతకుముందు శనివారం ఎక్కువగా 4,793 కేసులు నమోదయ్యాయి. ఈ రెండు వారాల్లోనే దాదాపు 53వేల కేసులు నమోదయ్యాయి. అంటే 55 శాతం కేసులు ఈ 14 రోజుల్లోనే రికార్డయ్యాయి. దానికి కారణాలు లేకపోలేదు. గుజరాత్ ప్రభుత్వం గత వారం రోజులుగా అహ్మదాబాద్లో సూపర్ స్ప్రెడర్లను గుర్తించేందుకు ఓ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. 703 మంది సూపర్ స్ప్రెడర్లను గుర్తించింది.
ఆ ఎఫెక్ట్తోనే ఎన్నడూ లేనిది గుజరాత్లోనూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇటు తమిళనాడులో కోయంబేడు మార్కెట్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. దీంతో ఆ రెండు రాష్ట్రాల్లో విపరీతంగా కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాల్లో కేసులు 10 వేల మార్కును దాటాయి. కోయంబేడు మార్కెట్ఎఫెక్ట్ ఒక్క తమిళనాడులో మాత్రమే కాదు.. పక్కరాష్ట్రాలపైనా పడింది. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ కావడం, అక్కడి నుంచి ఏపీ వంటి బార్డర్ రాష్ట్రాలకూ బిజినెస్ లింకులుండడంతో కేసులు పెరిగాయి. ఈ రెండు ఘటనల ఫలితంగా ఎక్కువ కేసులు రికార్డవుతున్నాయి. ఇటు, ఢిల్లీ కూడా 10 వేల కేసుల మార్కు దాటింది. గడిచిన 24గంటల్లో ఢిల్లీలో 721 కొత్త కేసులు నమోదయ్యాయి.
రికవరీలపై డిశ్చార్జ్ గైడ్లైన్స్ ఎఫెక్ట్
కొద్ది రోజుల క్రితం వరకూ కోలుకున్నోళ్ల సంఖ్య 25 నుంచి 30 శాతం వరకు ఉండేది. కానీ, ఇప్పుడది ఏకంగా 38 శాతం దాటింది. ఓ వారం రోజులుగా కోలుకుంటున్నోళ్ల సంఖ్య బాగా పెరుగుతోంది. రోజువారీ రికవరీల సంఖ్య 1,500కుపైనే ఉంటోంది. తొలిసారి శుక్రవారం రికవరీలు 2 వేల మార్కును దాటగా, శనివారం దానికి రెట్టింపు సంఖ్యలో హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జి అయ్యారు. సీరియస్ లక్షణాలు లేని వాళ్లకు టెస్టులు చేయకుండానే డిశ్చార్జి చేయొచ్చన్న కేంద్ర గైడ్లైన్స్ను అన్ని రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి. ఆ ఎఫెక్ట్తోనే కోలుకుంటున్నోళ్ల సంఖ్య అమాంతం పెరుగుతోంది. అయితే, డిశ్చార్జి చేసినా కొన్ని రోజులు ఇళ్లలోనే ఐసోలేట్ అవ్వాల్సిందిగా ఆ పేషెంట్లకు సూచిస్తున్నారు.
Read Here>> రెడ్ జోన్లలోనూ ఈ కామర్స్ ‘నాన్-ఎసెన్షియల్స్’ డెలివరీకి అనుమతి