YS Sharmila : పేదలకు దక్కాల్సిన స్కీములన్నీ బీఆర్ఎస్ దొంగల పాలు : వైఎస్ షర్మిల

అన్నింట్లో బందిపోట్ల దోపిడీలేనని విమర్శించారు. ఏ పథకం పేదలకు అందలేదన్నారు. లబ్ధి చేకూరిందల్లా దొరగారి అనుయాయులకేనని విమర్శించారు.

YS Sharmila : పేదలకు దక్కాల్సిన స్కీములన్నీ బీఆర్ఎస్ దొంగల పాలు : వైఎస్ షర్మిల

YS Sharmila

YS Sharmila Criticized KCR : బీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు చేశారు. “అర్హుల పొట్ట కొట్టు, బందిపోట్లకు పెట్టు” అన్న విధంగా ప్రభుత్వం తీరు ఉందని విమర్శించారు. 10 ఏళ్లుగా దొర(కేసీఆర్) అమలు చేసిన ప్రతి పథకం తీరిదేనని స్పష్టం చేశారు. పేదలకు దక్కాల్సిన స్కీములన్నీ బీఆర్ఎస్ దొంగల పాలవుతున్నాయని ఆరోపించారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నుంచి దళిత బంధు వరకు అన్నీ అక్రమాలేనని పేర్కొన్నారు.

అన్నింట్లో బందిపోట్ల దోపిడీలేనని విమర్శించారు. ఏ పథకం పేదలకు అందలేదన్నారు. లబ్ధి చేకూరిందల్లా దొరగారి అనుయాయులకేనని విమర్శించారు. 9 ఏళ్లుగా ఊరించి ఊరించి ఇచ్చిన అరకొర 4 లక్షల పోడు పట్టాలను సైతం కేసీఆర్ అండ్ కో వదిలిపెట్టలేదన్నారు. గిరిజనులకు దక్కాల్సిన భూముల్లో అక్రమాలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు.

Payyavula Keshav : సామాన్యుడికి ఇసుక దొరకడం లేదు.. కానీ, పక్క రాష్ట్రాలకు భారీగా అక్రమంగా తరలింపు : పయ్యావుల కేశవ్

అర్హులను పక్కననెట్టి డబ్బులు ముట్టజెప్పిన వారికే పోడు పట్టాలు ఇవ్వడం కేసీఆర్ అండ్ బ్యాచ్ కే చెల్లిందని ఎద్దేవా చేశారు. గిరిజనుల స్థానంలో బీఆర్ఎస్ లీడర్లు, ప్రభుత్వ ఉద్యోగులు పోడు పట్టాలు పొందడం దొరగారి పాలన దక్షతకు నిదర్శనమని పేర్కొన్నారు. పోడు పట్టాల పంపిణీలో ప్రభుత్వ డొల్లతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నారు.

ప్రభుత్వం పంచిన 4 లక్షల ఎకరాల్లో పట్టాలు ఎంతమంది అర్హులకు ఇచ్చారు? ఎంతమంది అనర్హులకు కట్టబెట్టారు? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు పట్టాలు ఇవ్వడం ఏంటి? గిరిజనులకు బదులు గిరిజనేతరులకు ఎలా పట్టాలు ఇచ్చారు? నిలదీశారు. పట్టాల కోసం దరఖాస్తు చేసుకోని వాళ్లకు ఎలా పట్టాలు ముట్టజెప్పారని అడిగారు. వెంటనే విచారణ కమిటీ వేసి పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నామని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.