Niranjan : కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణకు సీఐ బెదిరింపులు.. ఈసీకి ఫిర్యాదు చేసిన పార్టీ నేత నిరంజన్

బీఆర్ఎస్ పార్టీకి సీఐ అనుదీప్ అనుకూలంగా పనిచేస్తున్నారని నిరంజన్ ఆరోపించారు. వెంటనే సీఐపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Niranjan : కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణకు సీఐ బెదిరింపులు.. ఈసీకి ఫిర్యాదు చేసిన పార్టీ నేత నిరంజన్

Congress Leader Niranjan

Congress Leader Niranjan Complaint : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఘటనపై కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అచ్చంపేట సీఐ అనుదీప్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణను బెదిరించిన వీడియోను కంప్లైంట్ లో జత చేశారు. కాంగ్రెస్ వాళ్లకు సినిమా చూపిస్తానని సీఐ అనుదీప్ బెదిరించాడని పేర్కొన్నారు. వెంటనే సీఐపై చర్యలు తీసుకోవాలని నిరంజన్ కోరారు. బీఆర్ఎస్ పార్టీకి సీఐ అనుదీప్ అనుకూలంగా పనిచేస్తున్నారని నిరంజన్ ఆరోపించారు.

అచ్చంపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గువ్వల బాలరాజుపై రాళ్లతో దాడి జరిగింది. బాలరాజుపై కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ మరియు అతని వర్గీయులు దాడి చేసినట్లు తెలుస్తోంది. గువ్వల బాలరాజకు గాయాలు అయ్యాయి. గువ్వల బాలరాజును చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. బాలరాజు డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

Guvvala Amala : నా భర్తపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా : గువ్వల బాలరాజు సతీమణి

కుటుంబ సభ్యులు, అనుచరులు 3 గంటల ప్రాంతంలో అపోలో ఆస్పత్రికి గువ్వల బాలరాజును తీసుకొచ్చారు. గువ్వల బాలరాజు దవడ భాగంలో గాయం అవ్వడంతో ఆయనకు అపోలో వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. గువ్వల బాలరాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. గువ్వల బాలరాజు అనుచరులు అపోలో ఆస్పత్రి వద్దనే ఉన్నారు.

ఎన్నికల వేళ అచ్చంపేట రణరంగమైంది. అచ్చంపేట నియోజకవర్గంలో ఎన్నిక ప్రచారం ఉద్రికత్త నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. రాత్రి సమయంలో ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పలు గ్రామాల్లో ప్రచారం చేస్తూ అక్కడ డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

Guvvala Balaraju : బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై రాళ్ల దాడి

దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పెద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పరస్పరం రాళ్లు విసురుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం బాలరాజును ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు, అనుచరులు బాలరాజును హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అపోలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.