IND vs ENG : ఇంగ్లాండ్తో తొలి టెస్టుకు ముందు టీమ్ఇండియాకు షాక్..! అదే జరిగితే ఇక కష్టమే..!
ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు ముందు టీమ్ఇండియాను గాయాలు వెంటాడుతున్నాయి.
India and England : ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు ముందు టీమ్ఇండియాను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య, బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, స్టార్ పేసర్ మహ్మద్ షమీలు గాయాల కారణంగా ఈ సిరీస్కు అందుబాటులో ఉండని సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మిడిల్ ఆర్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. కాగా.. అతడికి అయిన గాయం తీవ్రత తెలియాల్సి ఉంది.
ఐదు మ్యాచుల టెస్టు సిరీస్లో భాగంగా హైదారాబాద్లోని ఉప్పల్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మొదటి టెస్టు మ్యాచ్ గురువారం జనవరి 25 నుంచి ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరు జట్లు హైదరాబాద్ చేరుకుని ప్రాక్టీస్ మొదలెట్టేశాయి. అయితే.. మంగళవారం నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా మిడిల్ ఆర్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కుడి మోచేతికి బంతి బలంగా తగిలింది.
Shoaib Malik : షోయబ్ మాలిక్ జీ.. ఈ ‘3’ లాజిక్ ఏంటో కాస్త చెప్పరు..! మరీ అంత ఇష్టం ఏంటో..!
దీంతో అతడు నొప్పితో విలవిలలాడాడు. అనంతరం ప్రాక్టీస్ కొనసాగించాలని చూసినప్పటికీ నొప్పి ఇబ్బంది పెట్టడంతో అతడు పక్కకు వెళ్లి కూర్చుకున్నాడు. అయితే.. శ్రేయస్కు అయిన గాయం తీవ్రమైనదా కాదా అన్నది విషయం ఇంకా తెలియరాలేదు. ఒకవేళ తీవ్రమైన గాయమై తొలి టెస్టుకు శ్రేయస్ దూరం అయితే మాత్రం టీమ్ఇండియాకు అది పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.
ఇప్పటికే వ్యక్తిగత కారణాలతో స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మొదటి రెండు టెస్టులకు దూరంగా అయ్యాడు. ఇప్పుడు అయ్యర్ కూడా దూరం అయితే అది భారత బ్యాటింగ్ విభాగంపై గట్టి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది.
WPL 2024 : డబ్ల్యూపీఎల్ 2024 షెడ్యూల్ విడుదల.. పూర్తి లిస్ట్ ఇదే.. ఫైనల్ మ్యాచ్ ఎప్పుడంటే..?
Shreyas Iyer gets hit on the right forearm during the nets in Hyderabad, walks off after trying to bat on. #INDvsENG pic.twitter.com/LM83qR4283
— Ganesh C (@ganeshcee) January 23, 2024