విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా టీడీపీ.. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని బరిలో నిలపకూడదని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.

విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా టీడీపీ.. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

YS Jagan mohan Reddy

YS Jaganh Mohan Reddy : విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని బరిలో నిలపకూడదని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. దీంతో ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గెలుపు ఖాయమైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని బరిలో నిలపకపోవడంతో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. బుధవారం యలమంచిలి, భీమిలి నియోజకవర్గాల జడ్పీటీసీ, ఎంపీటీసీలతో వైఎస్ జగన్
వేరువేరుగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట

చంద్రబాబు నాయుడు సహజనైజం ఇది కాదు. ఫోన్లు చేసి అది ఇస్తా.. ఇది ఇస్తా అంటూ ప్రలోబాలాకు గురిచేస్తాడు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందిరికీ కాల్స్ చేసి అది ఇస్తా.. ఇది ఇస్తా అని ఆశ చూపట్టే ఉంటాడు. కానీ, ధర్మం, న్యాయం గెలిచింది. మీరంతా ఒక్కటిగా నిలబడ్డారు కాబట్టి చంద్రబాబు మెడలు వంచక తప్పలేదని స్థానిక సంస్థల వైసీపీ ప్రజాప్రతినిధులను జగన్ అభినందించారు. సంఖ్యాబలం లేనప్పుడు టీడీపీ అభ్యర్థిని పోటీలోకి దింపుతామని చంద్రబాబు అనడమే తప్పు. కానీ, మీరంతా ఒక్కటిగా ఉండటం వల్లనే విజయం సాధ్యమైందని జగన్ పేర్కొన్నారు.