NTR : ముగ్గురు డైరెక్టర్స్.. మూడు పాన్ ఇండియా సినిమాలు.. తన డైరెక్టర్స్తో ఎన్టీఆర్ ఫోటో వైరల్..
ముంబై నుంచి ఎన్టీఆర్ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ముంబైలో ఉన్నాడు. నేడు సాయంత్రం దేవర ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. ఈ ట్రైలర్ లాంచ్ ని బాలీవుడ్ లో గ్రాండ్ గా చేయనున్నారు. ముంబైలో ఎన్టీఆర్ హవా నడుస్తుంది. పలువురు బాలీవుడ్ స్టార్స్ ని కలుస్తూ అక్కడి మీడియాకు ఫొటోలు ఇస్తూ సందడి చేస్తున్నారు. ముంబై నుంచి ఎన్టీఆర్ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలో ఎన్టీఆర్ ముగ్గురు డైరెక్టర్స్ తో దిగిన ఫోటో వైరల్ గా మారింది. దేవర డైరెక్టర్ కొరటాల శివ, ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్, వార్ 2 డైరెక్టర్ అయాన్ ముఖర్జీలతో కలిసి ఎన్టీఆర్ ఫోటో దిగాడు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. RRR తర్వాత రాబోయే తన పాన్ ఇండియా సినిమాల డైరెక్టర్స్ తో ఎన్టీఆర్ ముంబైలో ఫోటో దిగడంతో ఈ ఫోటో చర్చగా మారింది.
మొత్తానికి ఎన్టీఆర్ బాలీవుడ్ లో పాతుకుపోవడానికి గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు ఈ దేవర ప్రమోషన్స్ చూస్తుంటే తెలిసిపోతుంది.