Amaravati : మూడు రాజధానులు అమలు సాధ్యం కాదని జగన్ కు బాగా అర్థం అయ్యింది : జీవిఎల్
మూడు రాజధానులు అమలు సాధ్యం కాదని జగన్ కు బాగా అర్థం అయ్యింది అని..రాజకీయాల కోసం అమరావతిని బలి పట్టవద్దని బీజేపీ ఎంపీ జీవిఎల్ అన్నారు.

Amaravati : అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు రైతులతో బీజేపీ ఎంపీ జీవీఎల్ భేటీ అయ్యారు. వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా జీవిఎల్ మాట్లాడుతూ..మూడు రాజధానులు అమలు చేయటం సాధ్యం కాదు అనే విషయం జగన్ కు బాగా అర్థం అయ్యింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీని దెబ్బతీసేందుకే అమరావతిని నిర్లక్ష్యం చేశారని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. అమరావతి పరిధిలోని ప్రాంతాల్లో నిర్మాణాలను పరిశీలించిన అనంతరం తుళ్లూరు రైతులతో ఆయన సమావేశమైన సందర్భంగా జీవీఎస్ ఈ వ్యాఖ్యలు చేశారు.టీడీపీని..ఆ పార్టీ అధినేత చంద్రబాబును రాజకీయంగా దెబ్బతీసేందుకు వైకాపా యత్నిస్తోందని అన్నారు. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అమరావతిని ఆదర్శ రాజధాని చేస్తానని నమ్మించి అధికారంలోకి వచ్చాక ప్రజలకు జగన్ నమ్మక ద్రోహం చేశారంటూ మండిపడ్డారు. రాజకీయాల కోసం అమరావతిని బలిపెట్టొద్దు అని జగన్ కు హితవు పలికారు.
Also read : Nellore Student : ఆర్టీసీ బస్సు వెనకాల నిచ్చెన పట్టుకుని వేలాడుతూ 5 కి.మీ ప్రయాణించిన విద్యార్థి
జగన్ మాటలు నమ్మి ఓట్లు వేసిన ప్రజల్ని జగన్ నట్టేట ముంచారని.నమ్మి ఓట్లు వేసినవారిని నడిరోడ్డుమీ నిలబెట్టారంటూ విమర్శించారు. మూడు రాజధానులు అంటూ రాష్ట్రాన్ని జగన్ సర్వ నాశనం చేశారంటూ మండిపడ్డారు. మూడు రాజధానులు అమలు సాధ్యం కాదు అనే విషయం జగన్ కు బాగా అర్థం అయ్యింది అంటూ ఎద్దేవా చేశారు. దానికి సంబంధించి నిర్ణయం తీసుకుని కూడా పూర్తిగా చెప్పకుండా డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. రాజధాని అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉన్నా గానీ మిన్నకుండి ఉండిపోయాడని హైకోర్టు తీర్పును కూడా ధిక్కరిస్తున్నాడని విమర్శించారు.
Also read : Prakasam District : ప్రకాశం జిల్లాలో పెళ్లి చేసుకుని పరారైన భర్త
హైకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా జగన్ మూడు రాజధానులు అనడం తప్పని..ఆ తీర్పును ధిక్కరించేలా వైకాపా ప్రభుత్వ వైఖరి ఉందని జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగాలని బీజేపీ తీర్మానం చేసి చెప్పిందన్నారు. హైకోర్టు తీర్పు అమల్లో ఉండగా.. మూడు రాజధానులు లాంటి వేరే ప్రస్తావన చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పారు. హైకోర్టు తీర్పును సవాల్ చేసే సత్తా ఉంటే ఎందుకు చేయలేదని జీవీఎల్ ప్రశ్నించారు. ఇప్పటికైనా మొండివైఖరిని విడనాడి కనీస వసతులు కల్పిస్తే అమరావతి అభివృద్ధి చెందుతుందని జీవీఎల్ అభిప్రాయపడ్డారు.
1Tunnel Collapsed : జమ్మూకశ్మీర్ లో కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్
2Jr.NTR Fans : జూ.ఎన్టీఆర్ ఇంటిముందు అర్ధరాత్రి ఫ్యాన్స్ హంగామా..లాఠీచార్జ్ చేసిన పోలీసులు
3Vikram: హీరో నితిన్ చేతికి కమల్ విక్రమ్ తెలుగు రైట్స్..!
4Exorcism : ప్రాణాల మీదకు తెచ్చిన భూతవైద్యం
5Bigg Boss Nonstop: బిగ్ బాస్ విన్నర్ బిందు.. చరిత్ర సృష్టించబోతున్న ఆడపులి?
6YS Viveka Murder Case: విచారణ ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేం.. హైకోర్టుకు చెప్పిన సీబీఐ!
7CM KCR: నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాల కోసం వరస పర్యటనలు!
8Virat Kohli: సీజన్లో తొలి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీ
9IPL2022 Gujarat Vs RCB : బెంగళూరు భళా.. కీలక మ్యాచ్లో గుజరాత్పై విజయం, ఫ్లేఆఫ్స్ ఆశలు సజీవం
10Nikhat Zareen : చరిత్ర సృష్టించిన తెలంగాణ అమ్మాయి.. వరల్డ్ బాక్సింగ్ చాంపియన్గా నిఖత్ జరీన్
-
NBK107: అఖండ సెంటిమెంట్ను మళ్లీ ఫాలో అవుతున్న బాలయ్య..?
-
Allu Arjun: మహేష్కు అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్తో బన్నీ మూవీ..?
-
F3: ట్రిపుల్ ఫన్ మాత్రమే కాదు.. ట్రిపుల్ రెమ్యునరేషన్ కూడా!
-
NTR30: ధైర్యమే కాదు.. భయం కూడా రావాలి.. పూనకం తెప్పించిన తారక్!
-
Mahesh Babu: మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?
-
F3: ఎఫ్3 రన్టైమ్.. రెండున్నర గంటలు నవ్వులే నవ్వులు!
-
Tamannaah: ఆ ఒక్క సినిమా చేయకుండా ఉండాల్సింది.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
-
Cardimom : చర్మసౌందర్యానికి మేలుకలిగించే యాలకుల్లోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు!