AP-Telangana power Bills : ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలపై సీఎం కేసీఆర్ సమీక్ష .. కేంద్రం లెక్కలు అవాస్తం అంటున్న తెలంగాణ

ఏపీ జెన్‌‌కోకు మొత్తం రూ. 6,756.92 కోట్లు చెల్లించాలని తెలంగాణకు కేంద్రం ఆదేశించింది. దీంతో తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యవసరంగా ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించనున్నారు. ఏపీకి చెల్లించాలని ఆదేశించిన విద్యుత్ బకాయిల లెక్కలు అవాస్తవాలని సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తంచేస్తున్నారు.

AP-Telangana power Bills : ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలపై సీఎం కేసీఆర్ సమీక్ష .. కేంద్రం లెక్కలు అవాస్తం అంటున్న తెలంగాణ

Center orders telangana to pay power bill to APGENCo..

AP-Telangana power bill : ఏపీ జెన్‌‌కోకు మొత్తం రూ. 6,756.92 కోట్లు చెల్లించాలని తెలంగాణకు కేంద్రం ఆదేశించింది. దీంతో తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యవసరంగా ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించనున్నారు. ఏపీకి చెల్లించాలని ఆదేశించిన విద్యుత్ బకాయిల లెక్కలు అవాస్తవాలని సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తంచేస్తున్నారు. దీంతో తెలంగాణ జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు, విద్యుత్ శాఖ అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. కేంద్రం ఆదేశాలను సమావేశంలో చర్చించనున్నారు. విద్యుత్ బకాయిల విషయంపై కూలంకషంగా చర్చించి కేంద్రానికి సమాచారం ఇవ్వనునుంది తెలంగాణ ప్రభుత్వం. దీనిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేదానిపై చర్చించనున్నారు. ఇదిలా ఉంటే కేంద్రం చెబుతున్న లెక్కలన్ని అవాస్తవాలని..ఏపీ డిస్కంల నుంచి తెలంగాణకు రూ.12,940 కోట్లు రావాలని తెలంగాణ అధికారులు అంటున్నారు. తెలంగాణాకు ఏపీ చెల్లించాల్సిన బకాయిల గురించి తేల్చకుండా తిరిగి తెలంగాణాయే ఏపీకి బకాయిలు చెల్లించాలని ఆదేశించటం ఏంటీ అంటూ ప్రశ్నిస్తు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది తెలంగాణ జెన్ కో.

కాగా ఏపీ జెన్ కో..సరఫరా చేసిన విద్యుత్‌కు గాను చెల్లించాల్సిన రూ. 3,441.78 కోట్లతోపాటు..చెల్లింపులో జరిగిన జాప్యానికి సర్‌చార్జ్ రూ.3,315.14 కోట్లు (31 జులై 2022 వరకు) కలిపి మొత్తంగా రూ. 6,756.92 కోట్లు చెల్లించాలని తెలంగాణ విద్యుత్ సంస్థలను కేంద్రం ఆదేశించింది. ఈ మొత్తాన్ని నెల రోజుల్లోపు చెల్లించాలని పేర్కొంటూ కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ డిప్యూటీ సెక్రటరీ అనూప్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం నివ్వెరపోయింది. తక్షణమే సమావేశం నిర్వహించి చర్చించనున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు, విద్యుత్ శాఖ అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు.

రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 నిబంధనల మేరకు కేంద్రం ఆదేశాలతో తెలంగాణకు ఏపీ జెన్‌కో విద్యుత్ సరఫరా చేసిందని పేర్కొన్న కేంద్రం.. విభజన చట్టంలోని సెక్షన్ 92 ప్రకారం బకాయిలు చెల్లించేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం కేంద్రానికి ఉందని స్పష్టం చేసింది. విభజన జరిగిన తర్వాత విద్యుత్ సరఫరా జరిగిందని, కాబట్టి విభజన వివాదాలతో దీనిని ముడిపెట్టడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. కాబట్టి 30 రోజుల్లో మొత్తం బకాయిలను చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది.

అయితే, తెలంగాణ వాదన మరోలా ఉంది. విభజనకు ముందు కర్నూలు, అనంతపురం జిల్లాలు తెలంగాణ పరిధిలోని కేంద్రీయ విద్యుత్ పంపిణీ సంస్థ (సీపీడీసీఎల్) పరిధిలో ఉన్నాయని తెలంగాణ విద్యుత్ సంస్థలు చెబుతున్నాయి. ఈ రెండు జిల్లాల్లో విద్యుత్ సరఫరా మెరుగుపరిచేందుకు విద్యుత్ సంస్థలు రుణాలు తీసుకున్నాయని పేర్కొన్నాయి. ఈ రుణాల చెల్లింపునకు తీసుకున్న మొత్తం రూ.12,941 కోట్లు ఉంటుందని, ఈ లెక్కన ఏపీ జెన్‌కోకు చెల్లించాల్సిన బకాయిల కంటే ఇవే ఎక్కువని, కాబట్టి ఏపీకి బకాయిలు చెల్లించే ప్రశ్నే లేదని గతంలో పలుమార్లు పేర్కొన్నాయి. అయితే, ఇప్పుడు కేంద్రం ఆదేశాలతో తప్పక చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తింది.