Chandrababu : బుద్ధా వెంకన్న అరెస్ట్.. పోలీసులకు చంద్రబాబు వార్నింగ్
గుడివాడలో ఏమీ జరగకుంటే ప్రభుత్వం, పోలీసులు ఎందుకు మాట్లాడడం లేదని చంద్రబాబు నిలదీశారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టి నిలదీసిన వారిని అరెస్ట్ చేయడం హేయం అన్నారు.

Chandrababu : టీడీపీ నేత బుద్ధా వెంకన్న అరెస్ట్ పై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. బుద్ధా అరెస్ట్ ను చంద్రబాబు ఖండించారు. బుద్ధా అరెస్ట్ కుట్రపూరితం అన్నారు. తమ నేతను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొడాలి నాని కేసినోపై ప్రశ్నించిన తమ నేతలను అరెస్ట్ చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.
గుడివాడలో ఏమీ జరగకుంటే ప్రభుత్వం, పోలీసులు ఎందుకు మాట్లాడడం లేదని చంద్రబాబు నిలదీశారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టి నిలదీసిన వారిని అరెస్ట్ చేయడం హేయం అన్నారు. పోలీసుల వైఖరి దుర్మార్గంగా ఉందన్న చంద్రబాబు, తప్పు చేసిన పోలీసులు విచారణ ఎదుర్కొనక తప్పదని హెచ్చరించారు.
COVID : కరోనాపై సైంటిస్టుల తీపి కబురు
ఈ వ్యవహారంపై నారా లోకేష్ కూడా స్పందించారు. ఏపీలో పోలీసులు ప్రజా రక్షణ కోసమే పని చేస్తున్నారా? లేదంటే వైసీపీ నేతలకు కాపలా కాస్తున్నారా? అని ప్రశ్నించారు లోకేశ్. బుద్దా వెంకన్న అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. కొడాలి నాని క్యాసినో నడిపినప్పుడు, గడ్డం గ్యాంగ్ ప్రతిపక్ష నేతని బూతులు తిట్టినప్పుడు.. పోలీసులు ఎక్కడున్నారని లోకేశ్ ప్రశ్నించారు. ‘‘గతంలో చంద్రబాబు ఇంటిపై దాడి చేసినప్పుడు పోలీసులు లేరు. టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేస్తే నో పోలీస్’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిని నిలదీస్తే.. పోలీసులు పరుగున వచ్చి వెంకన్నను అరెస్టు చేశారని ధ్వజమెత్తారు.
ఉద్రిక్త పరిస్థితుల నడుమ బుద్ధా వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం సాయంత్రం బుద్ధా నివాసానికి చేరుకున్న పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి వాహనంలోకి ఎక్కించారు. మంత్రి కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బుద్ధాపై కేసు నమోదు చేశారు. అరెస్ట్ సందర్భంగా బుద్ధా వెంకన్న డీజీపీపై మండిపడ్డారు. డీజీపీ తీరు చూస్తుంటే జగన్ పార్టీకి డైరెక్టర్ లా ఉందని విమర్శించారు.
Watching TV : అధిక సమయం టీవీ చూసే అలవాటుందా?… అయితే జాగ్రత్త?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుడివాడ కేసినో వివాదం దుమారం రేపుతోంది. టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. చూసుకుందాం రా.. తేల్చుకుందాం రా.. కొట్టుకుందాం రా.. అంటూ.. సవాళ్లు, ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ ను మరింత పెంచారు. మంత్రి కొడాలి నానికి చెందిన కే కన్వెషన్ లో కేసినో జరిగిందని టీడీపీ ఆరోపిస్తోంది. కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని, మంత్రివర్గం నుంచి తొలగించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
- Kodali Nani: టీడీపీకి ప్రజలు సమాధి కడతారు: కొడాలి నాని
- TDP mahanadu: మహానాడు వేదికగా సమరశంఖం పూరించనున్న చంద్రబాబు.. నేటి కార్యక్రమాలు ఇలా..
- Chandrababu Naidu: “అప్పటి ప్రధాని వాజ్పేయి రావడం మరిచిపోలేని సంఘటన”
- Chandrababu Naidu: కోనసీమలో చిచ్చు పెట్టింది వైసీపీనే: చంద్రబాబు
- Chandrababu Letter To Stalin : ఏపీ రేషన్ రైస్ మాఫియా.. తమిళనాడు సీఎం స్టాలిన్కు చంద్రబాబు లేఖ
1Southwest Monsoon : కేరళ వైపు పయనిస్తున్న నైరుతి రుతుపవనాలు
2జగన్ నీ పతనం మొదలైంది..!
3Boney Kapoor : బోనికపూర్ క్రెడిట్ కార్డు నుంచి 3.82 లక్షలు చోరీ.. పోయినట్టు కూడా తెలీదు..
4వైసీపీపై రామ్మోహన్ నాయుడు ప్రశ్నల వర్షం
5మహానాడు వేదికగా చంద్రబాబు సవాల్…!
6కమ్మ సామాజిక వర్గానికి దగ్గరయ్యే ప్రయత్నమా..?
7Delhi : నైజీరియా వ్యక్తి నిర్వాకం..పెళ్లి పేరుతో 300 మంది భారతీయ మహిళలను మోసగించి..రూ.కోట్లు దోచేసిన ఘనుడు
8తారక మంత్రం జపిస్తున్న టీఆర్ఎస్ నేతలు
9టీఆర్ఎస్ రాజకీయ వ్యూహం ఏంటి : తెలకపల్లి విశ్లేషణ
10Sleep Position : ఏ భంగిమలో నిద్రించాలి.. ఏవైపు తిరిగితే మంచిదంటే?
-
Cyber Criminals : లోన్ ఇప్పిస్తామని రూ.40,000 కాజేసిన సైబర్ నేరగాళ్లు
-
Jalli Keerthi : ఐఏఎస్ సేవకు అందరూ ఫిదా..వరదల్లో సర్వం కోల్పోయినవారికి అండగా తెలంగాణ ఆడబిడ్డ
-
TRS : ఎన్టీఆర్కు ఘనంగా టీఆర్ఎస్ నివాళి..!
-
Unscrupulous activities : ఆంధ్రాయూనివర్శిటీలో అసాంఘీక కార్యకలాపాలు
-
Terrorists Encounter : టీవీ నటిని హత్య చేసిన ఉగ్రవాదుల హతం..హత్య జరిగిన 24 గంటల్లోనే ఎన్కౌంటర్
-
Adilabad : వేరే మతస్తుడిని పెళ్లి చేసుకుందని కూతురు గొంతు కోసి చంపిన తండ్రి
-
IPL 2022: ఆర్సీబీ కల చెదిరే.. 15 ఏళ్లుగా టైటిల్ పోరాటం.. ఈ పెయిన్ కోహ్లీకి మాత్రమే తెలుసు!
-
Minister KTR : మంత్రి కేటీఆర్ యూకే, దావోస్ పర్యటన..తెలగాంణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు