Andhra Pradesh Corona : ఏపీలో కరోనా, 22 వేల 399 కేసులు, 89 మంది మృతి
ఏపీ రాష్ట్రంలో కరోనా వేవ్ తగ్గుముఖం పట్టడం లేదు. 24 గంటల వ్యవధిలో 22 వేల 399 మందికి కరోనా సోకింది.
COVID-19 Cases : ఏపీ రాష్ట్రంలో కరోనా వేవ్ తగ్గుముఖం పట్టడం లేదు. 24 గంటల వ్యవధిలో 22 వేల 399 మందికి కరోనా సోకింది. 89 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. దీని కారణంగా విశాఖపట్టణంలో 11 మంది, విజయనగరంలో 11 మంది, చిత్తూరులో 9 మంది, తూర్పుగోదావరిలో 9 మంది, కృష్ణాలో 8 మంది, ప్రకాశంలో 8 మంది, శ్రీకాకుళంలో ఏడుగురు, గుంటూరులో ఆరుగురు, నెల్లూరులో ఐదుగురు, కడపలో నలుగురు, కర్నూలులో నలుగురు, పశ్చిమ గోదావరిలో నలుగురు, అనంతపురంలో ముగ్గురు చనిపోయారు.
గడిచిన 24 గంటల్లో 18 వేల 638 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారని వెల్లడించింది. 2021, మే 13వ తేదీ గురువారం వరకు రాష్ట్రంలో 1,77,02,133 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని వెల్లడించింది.
రాష్ట్రంలో నమోదైన మొత్తం 13,63,890 పాజిటివ్ కేసులకు గాను..11 లక్షల 53 వేల 771 మంది డిశ్చార్జ్ కాగా..9 వేల 077 మంది మృతి చెందారని..ప్రస్తుతం 2,01,042 మంది చికిత్స పొందుతున్నారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 2080. చిత్తూరు 2646. ఈస్ట్ గోదావరి 3372. గుంటూరు 2141. వైఎస్ఆర్ కడప 1447. కృష్ణా 910. కర్నూలు 1365. నెల్లూరు 1589. ప్రకాశం 1489. శ్రీకాకుళం 824. విశాఖపట్టణం 2064. విజయనగరం 896. వెస్ట్ గోదావరి 1576. మొత్తం : 22,399.
Read More : Lockdown Permission: ఈ-పాస్ ఇప్పిస్తే ఆ పనికి వెళ్లొస్తానంటూ పోలీసులకు రిక్వెస్ట్
#COVIDUpdates: 13/05/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 13,63,890 పాజిటివ్ కేసు లకు గాను
*11,53,771 మంది డిశ్చార్జ్ కాగా
*9,077 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,01,042#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/OhcnSszgK7— ArogyaAndhra (@ArogyaAndhra) May 13, 2021