ఏపీలో మూడుకు చేరిన కరోనా కేసులు

  • Published By: vamsi ,Published On : March 19, 2020 / 05:51 PM IST
ఏపీలో మూడుకు చేరిన కరోనా కేసులు

తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో కరోనా కేసులు 16కు చేరుకోవడంతో ప్రజల్లో కంగారు మొదలవగా… లేటెస్ట్‌గా ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడుకు చేరుకుంది.

విశాఖలో ఓ వ్యక్తికి కరోనా ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. బాధితుడికి విశాఖలోని చెస్ట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. విశాఖకు చెందిన ఆ వ్యక్తి కొన్ని రోజుల క్రితం మక్కాకు వెళ్లి రాగా.. అతనికి పాజిటివ్ అని తేలింది.

ఇటీవల అనారోగ్యంగా ఉండడంతో ఆస్పత్రిలో చెక్ చేయించుకోగా.. అతనికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఒకరు, ప్రకాశం జిల్లాలో మరొకరు కరోనా పాజిటివ్ బాధితులు చికిత్స పొందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాధి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే విద్యాసంస్థలు, స్కూళ్లు బంద్ చేయించారు. 

See Also | తెలంగాణలో మరో ముగ్గురికి కరోనా వైరస్: 16కు చేరిన బాధితుల సంఖ్య