Srisailam Temple : శ్రీశైలం ఆలయ దర్శన వేళల్లో మార్పులు
కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయ దర్శన వేళల్లో మార్పులు చేసినట్లు దేవస్థానం ఈవో కె.ఎస్. రామారావు తెలిపారు.
Srisailam Temple : కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయ దర్శన వేళల్లో మార్పులు చేసినట్లు దేవస్థానం ఈవో కె.ఎస్. రామారావు తెలిపారు.
జులై 1 నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులకు శ్రీస్వామి అమ్మ వార్ల దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు.
సాయంత్రం 3.30 గంటల నుంచి 6 గంటల వరకు ఆలయ శుద్ధి, సాయంత్రం పూజలు జరుగుతాయన్నారు. ఆలయంలో జరిగే పరోక్ష ఆర్జిత సేవలు యథావిధిగా నిర్వహించనున్నట్లు చెప్పారు.