Anam Ramanarayana Reddy : భవిష్యత్తులో స్ట్రీట్ వార్ జరిగే ప్రమాదం- జగన్ ప్రభుత్వానికి ఆనం రామనారాయణరెడ్డి హెచ్చరిక

Anam Ramanarayana Reddy : పట్టపగలు ప్రతిపక్షనేతలపై దాడులు జగన్ రెడ్డి రౌడీ పాలనకు నిదర్శనం అని ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి అండతో రాష్ట్రంలో వైసీపీ మూకలు రెచ్చిపోతున్నాయన్నారు.

Anam Ramanarayana Reddy : భవిష్యత్తులో స్ట్రీట్ వార్ జరిగే ప్రమాదం- జగన్ ప్రభుత్వానికి ఆనం రామనారాయణరెడ్డి హెచ్చరిక

Anam Ramanarayana Reddy

Anam Ramanarayana Reddy – CM Jagan : టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డిపై దాడికి యత్నం కలకలం రేపింది. ఈ వ్యవహారం ఏపీలో రాజకీయాలను వేడెక్కించింది. దీనిపై టీడీపీ నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. అధికార పార్టీని టార్గెట్ చేశారు. ఇది వైసీపీ మూకల పనే అని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అవినీతి ప్రశ్నించినందుకు దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు.

అటు వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సైతం తీవ్రంగా స్పందించారు. దాడికి పాల్పడ్డ వారిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో స్ట్రీట్ వార్ జరిగే ప్రమాదం ఉందని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి హెచ్చరించారు.

Also Read..Chandrababu : ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన.. త్వరలో టీడీపీ, బీజేపీ పొత్తుపై క్లారిటీ

”ఆనం వెంకటరమణారెడ్డిపై జరిగినది రాజకీయ దాడి. వైసీపీ నాయకులే ఈ దాడి చేయించారు. ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారనే కారణంతోనే దాడి చేశారు. ఈ దాడితో ఆనం వెంకట రమణారెడ్డి భయపడే ప్రసక్తి ఉండదు. మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు. రాజకీయాల్లో విమర్శలు చేసుకోవచ్చు. కానీ, ఇలాంటి దాడులు జరగడం దురదృష్టకరం. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరాం. ఇప్పుడే ఈ దాడులపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో స్ట్రీట్ వార్ జరిగే ప్రమాదం ఉంది” అని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.

భయపెట్టాలనుకోవడం జగన్ రెడ్డి పగటి కల:
టీడీపీ సీనియర్ నేత ఆనం వెంటకరమణారెడ్డిపై దాడి ఘటనను ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్రంగా ఖండించారు. ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి దుర్మార్గం అన్నారు. పట్టపగలు ప్రతిపక్షనేతలపై దాడులు జగన్ రెడ్డి రౌడీ పాలనకు నిదర్శనం అని ధ్వజమెత్తారు. ఆనం వెంకట రమణారెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతున్నారన్న కక్షతోనే దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. జగన్ రెడ్డి అండతో రాష్ట్రంలో వైసీపీ మూకలు రెచ్చిపోతున్నాయన్నారు.

ఇలాంటి దాడులతో మమ్మల్ని భయపెట్టాలనుకోవడం జగన్ రెడ్డి పగటి కల అని యనమల అన్నారు. మాపై ఎన్ని దాడులు చేసినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో కొట్లాడుతాం అని యనమల రామకృష్ణుడు తేల్చి చెప్పారు. ఆనంపై దాడికి ప్రయత్నించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు యనమల.

Also Read..Nara Lokesh : పాదయాత్రలో నారా లోకేశ్‌పై దాడి.. ప్రొద్దుటూరులో ఉద్రిక్తత

నెల్లూరులో కలకలం రేగింది. టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డిపై కొందరు దుండగులు దాడికి ప్రయత్నం చేశారు. ఆర్టీఏ కార్యాలయం సమీపంలో ఈ ఘటన జరిగింది. తన ఆఫీసు నుంచి బయటకు వస్తున్న సమయంలో దాడికి యత్నం జరిగింది. కొందరు దుండగులు వాటర్ ట్యాంక్ వెనుక మాటు వేశారు. వారు ముఖానికి కర్చీఫ్ లు కట్టుకున్నారు. చేతిలో దుడ్డు కర్రలతో ఆనం వెంకటరమణారెడ్డిపై దాడికి యత్నించారు. ఇంతలోనే అప్రమత్తమైన ఆనం వెంకటరమణారెడ్డి తప్పించుకుని ఆఫీసులోకి వెళ్లిపోయారు.

వెంటనే స్పందించిన టీడీపీ కార్యకర్తలు, ఆనం అనుచరులు దుండగులను ప్రతిఘటించారు. వారిని పట్టుకునేందుకు వెంబడించారు. దాంతో ఆ వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. వైసీపీ కార్యకర్తలే ఈ దాడికి యత్నించారని ఆనం అనుచరులు ఆరోపిస్తున్నారు. సీఎం జగన్ విమర్శలు చేసినందుకు, ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు దాడికి యత్నించారని చెప్పారు.

ఇటీవలి కాలంలో సీఎం జగన్ తో పాటు వైసీపీ ప్రభుత్వ విధానాలు, వైసీపీ నాయకులపై ఆనం వెంకటరమణారెడ్డి ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దుండగులు దాడికి యత్నించినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.