Jogi ramesh: మంత్రి జోగి రమేశ్కు తృటిలో తప్పిన ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ మంత్రి జోగి రమేశ్కు తృటిలో ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం పెల్లూరు వద్ద ఆయన కారు ప్రమాదానికి గురైంది.
Jogi ramesh: ఆంధ్రప్రదేశ్ మంత్రి జోగి రమేశ్కు తృటిలో ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం పెల్లూరు వద్ద ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఆయన చిలకలూరి పేట నుంచి నెల్లూరుకు వెళుతుండగా మార్గమధ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పెల్లూరు హైవే 16 మీదుగా జోగి రమేశ్ కారు వెళుతోంది. అక్కడ వాహనాల మళ్లింపు కోసం ఏర్పాటు చేసిన బార్ గేట్స్ వద్ద కారు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేకు వేశాడు.
OIC: అన్ని మతాలను గౌరవించాలని మేమే మిమ్మల్ని కోరుతున్నాం: భారత్ ఘాటు స్పందన
దీంతో మూడు కార్లు అదుపుతప్పి అక్కడి డివైడర్ను ఢీ కొన్నాయి. ఆ కార్ల ముందు భాగాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో జోగి రమేశ్కు గాయాలు కాలేదు. ఆయనకు ప్రమాదం తప్పడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మంత్రి వెంటనే మరో కారులో నెల్లూరుకు వెళ్లారు.