TDP : టీడీపీ నేతలపై కేసులు నమోదు

చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నేతలపై కేసులు నమోదు అయ్యాయి. మున్సిపల్ కార్యాలయంపై దాడి చేశారంటూ కమిషనర్ చిట్టిబాబు ఫిర్యాదుతో 19 మందిపై కుప్పం పిఎస్ లో కేసు నమోదు అయింది.

TDP : టీడీపీ నేతలపై కేసులు నమోదు

Tdp

police Cases against TDP : చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నేతలపై కేసులు నమోదు అయ్యాయి. మున్సిపల్ కార్యాలయంపై దాడి చేశారంటూ కమిషనర్ చిట్టిబాబు ఫిర్యాదుతో 19 మందిపై కుప్పం పిఎస్ లో కేసు నమోదు అయింది. టీడీపీ నేతలపై 143,147, 353, 427, R/w 149 ipc 3 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

కుప్పం మున్సిపల్ కార్యాలయంలో గత రాత్రి జరిగిన గొడవపై డీఎస్పీ గంగయ్య మీడియాతో మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న కుప్పంలో అలజడి సృష్టించాలని చూస్తున్నారని తెలిపారు. నిన్న మున్సిపల్ కార్యాలయంలో అవాంఛనీయ ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. ఓ పార్టీకి చెందిన వ్యక్తులు మున్సిపల్ అధికారిపై దాడికి దిగారని, అద్దాలు ధ్వంసం చేశారని తెలిపారు.

Chennai Rains: చెన్నైను ముంచెత్తిన వరదలు… ఆ రెండు రోజుల్లో అతిభారీ వర్షాలు.. రెడ్ అలర్ట్!

ఆర్వో ఫిర్యాదు మేరకు నేతలపై కేసులు నమోదు చేశామని వెల్లడించారు. కేసులు నమోదైన వారిలో ఇతర జిల్లాలకు చెందిన నేతలే ఎక్కువ మంది ఉన్నారని పేర్కొన్నారు. వారు వెంటనే ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళి పోవాలని సూచించారు. లేకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.