Road Accident Six Died : పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ, ఆటో ఢీకొని ఆరుగురు మృతి

పార్వతీపురం మన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందారు. కొమరాడ వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన స్పాట్ లోనే ఆరుగురూ చనిపోయారు. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Road Accident Six Died : పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ, ఆటో ఢీకొని ఆరుగురు మృతి

road accident

Road Accident Six Died : పార్వతీపురం మన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందారు. కొమరాడ వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన స్పాట్ లోనే ఆరుగురూ చనిపోయారు. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. చోళ్లపదం గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆటోలో ఉన్న ప్రయాణికులను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది.

దీంతో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని పార్వతీపురం మన్యం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొమరాడ మండలం అంటివాస గ్రామానికి చెందిన వారంతా అదే మండలానికి చెందిన తుమ్మలపల్లి గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు వెళ్లారు. అనంతరం వారందరూ తిరిగి ఆటోలో వస్తున్నారు.

Road Accident Three Died : గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. బైక్ పై వెళ్తున్న ముగ్గురు మృతి

మార్గంమధ్యలో విశాఖ నుంచి రాయ్ గఢ్ వెళ్తోన్న లారీ అతి వేగంగా వెళ్లి ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటో తునాతునకలైంది. ఆటోలో ప్రయాణిస్తున్న 9 మందిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రాథిమికంగా తెలుస్తోంది. ఆటో డ్రైవర్ తోపాటు మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

లారీ, ఆటో డ్రైవర్లు అతి వేగం, నిర్లక్ష్యంతోపాటు ఇరువైపులా తప్పు ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక సమాచారం. ఈ ప్రమాదానికి అతి వేగం, నిర్లక్షమే కారణమని తెలుస్తోంది. పోలీసులు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు మృతి చెందటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.