AP CID : సీఎం జగన్ పై తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోండి, సీఐడీకి ఫిర్యాదు
సోషల్ మీడియాలో సీఎం జగన్ పై అసభ్య పదజాలంతో దుష్ప్రచారం చేస్తున్న వారిపై ఏపీ సీఐడీ పోలీసులకు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు.
AP CID : సోషల్ మీడియాలో సీఎం జగన్ పై అసభ్య పదజాలంతో దుష్ప్రచారం చేస్తున్న వారిపై ఏపీ సీఐడీ పోలీసులకు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నవారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. మార్ఫింగ్ కంటెంట్తో విద్వేషపూరితమైన ప్రచారం చేస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై.. చర్యలు తీసుకోవాలని సీఐడీ పోలీసులకు లేళ్ల అప్పిరెడ్డి విజ్ఞప్తి చేశారు. టీడీపీ పొలిటికల్ వింగ్, టీడీపీ యాక్టివిస్ట్, రాజ్బొడ వంటి పేజ్లపై చర్యలు తీసుకోవాలన్నారు.
వైసీపీ నేతలు ఈదా రాజశేఖర్ రెడ్డి, అంకం రెడ్డి నారాయణ మూర్తి సైతం సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం జగన్ పై తప్పుడు ప్రచారం చేస్తూ పెడుతున్న వార్తలను, ఫొటోలను మార్ఫింగ్ చేస్తున్న సోషల్ మీడియా అకౌంట్లను వెంటనే తొలగించాలని కోరారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి కఠిన శిక్షలు విధించాలని వైసీపీ నేతలు కోరారు.