Polavaram project: పోలవరంలో తొలి ఫలితం.. నేడే అంకురార్పణ!

గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా, పోలవరంలో నిర్మిస్తోన్న పోలవరం ప్రాజెక్టులో నేడే తొలి ఫలితానికి అంకురార్పణ జరగనుంది. పోలవరం ప్రాజెక్ట్‌లో భాగంగా డెల్టాకు స్పిల్ వే మీదుగా కాసేపట్లో గోదావరి నీటిని విడుదల చేయనున్నారు.

Polavaram project: పోలవరంలో తొలి ఫలితం.. నేడే అంకురార్పణ!

Polavaram Project

First Result: గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా, పోలవరంలో నిర్మిస్తోన్న పోలవరం ప్రాజెక్టులో నేడే తొలి ఫలితానికి అంకురార్పణ జరగనుంది. పోలవరం ప్రాజెక్ట్‌లో భాగంగా డెల్టాకు స్పిల్ వే మీదుగా కాసేపట్లో గోదావరి నీటిని విడుదల చేయనున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా ఈసిఆర్ఎఫ్(ECRF) నిర్మాణం కోసం అప్పర్ కాఫర్ డ్యాం పూర్తి చేసి స్పిల్ వే మీదుగా నీటిని విడుదల చేయనున్నారు.

ఉదయం 11గంటల 30నిమిషాలకు అప్రోచ్ చానెల్ ద్వారా డెల్టాకు నీటిని విడుదల చేయడానికి ముహూర్తంగా నిర్ణయించింది ప్రభుత్వం. వర్చువల్ ద్వారా ఈ కార్యక్రమం‌లో మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, ఆళ్ల నాని పాల్గొననున్నారు. పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ENC నారాయణ రెడ్డితో పాటు తదితర అధికారులు, మేఘా ఇంజనీరింగ్ నుంచి రంగరాజన్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

గోదావరి నీరు అప్రోచ్ కెనాల్‌కు విడుదల:
ఈ సంధర్భంగా గోదావరి నీరు అప్రోచ్ కెనాల్‌కు విడుదల చేయనున్నారు. ఆ నీరు స్పిల్ వే, రివర్ స్లూయిజ్ గేట్ల ద్వారా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌కు చేరి, అక్కడి నుంచి సెంట్రల్ డెల్టాతో పాటు తూర్పు, పశ్చిమ కాలువల ద్వారా గోదావరి డెల్టాకు చేరి పంటలకు నీరు అందనుంది. భారీ వర్షాల సీజన్‌లోనే వరదను మళ్లించడానికి అనుగుణంగా అప్రోచ్ ఛానెల్, స్పిల్ వే గేట్ల ఏర్పాటు చేశామని, స్పిల్ ఛానెల్, పైలెట్ ఛానెల్ దాదాపు పూర్తయినట్లు చెప్పారు.

గోదావరి నదిలో ప్రవాహానికి అడ్డుకట్ట వేసే విధంగా అప్పర్ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి చేసినట్లు చెప్పారు. 6.6 కిలోమీటర్ల మేర గోదావరి ప్రవాహం మళ్లించనున్నారు. అతి తక్కువ సమయంలోనే భారీ పనులు, నిర్మాణాలు పూర్తి చేసి, డెల్టాకు నీరందించే ప్రక్రియ పూర్తి చేసింది మేఘా ఇంజనీరింగ్ సంస్థ.