Kakinada : భార్యను హత్య చేసిన భర్త..పది నెలల క్రితమే ప్రేమ వివాహం
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దారుణం జరిగింది. భర్త చేతిలో భార్య హత్యకు గురయ్యారు. మృతురాలు పశ్చిమగోదారి జిల్లా కాకిపాడుకు చెందిన సుధారాణిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.
husband murdered wife : తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో దారుణం జరిగింది. భర్త చేతిలో భార్య హత్యకు గురయ్యారు. కత్తితో గొంతుపై పొడిచి హత్య చేశారు. మృతురాలు పశ్చిమగోదారి జిల్లా కాకిపాడుకు చెందిన సుధారాణిగా గుర్తించారు. కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో పారా మెడికల్ కోర్సు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పశ్చిమగోదారి జిల్లా యాళ్లగూడెంకు చెందిన గంగరాజు, సుధారాణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పది నెలల క్రితమే వివాహం జరిగింది. ఇద్దరూ ఈ నెల 17న నగరంలోని ఓ లాడ్జిలో బస చేశారు. మనస్పర్ధలతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
Narendra Giri Maharaj : మహంత్ నరేంద్రగిరిది హత్యా? ఆత్మహత్యా?
క్షణికావేశంలో గంగరాజు.. తన భార్య సుధారాణి మెడపై కత్తితో పొడిచి హత్య చేశాడు. నిందితుడు ఏలూరు రూరల్ పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.