Car Donate : తిరుమల శ్రీవారికి విరాళంగా రూ.17 లక్షల విలువైన కారు

శ్రీవారి ఆలయం వద్ద ఆలయ అధికారులకు ఆ కారును తిరుపతి ఎంజీ కార్స్ అధినేత ఉదయ్ కుమార్ రెడ్డి అందజేశారు. అలాగే ఈనెల 18న టీటీడీకి రికార్డు స్థాయిలో 84 కోట్ల రూపాయల విరాళం వచ్చింది.

Car Donate : తిరుమల శ్రీవారికి విరాళంగా రూ.17 లక్షల విలువైన కారు

Ttd

car donate to TTD : తిరుమల శ్రీవారికి 17 లక్షల విలువైన ఎంజీ కార్ విరాళంగా వచ్చింది. శ్రీవారి ఆలయం వద్ద ఆలయ అధికారులకు ఆ కారును తిరుపతి ఎంజీ కార్స్ అధినేత ఉదయ్ కుమార్ రెడ్డి అందజేశారు. అలాగే ఈనెల 18న టీటీడీకి ఒకేరోజు రికార్డు స్థాయిలో 84 కోట్ల రూపాయల విరాళం వచ్చింది. తిరుపతిలో చిన్న పిల్లల కార్డియాలజీ ఆసుపత్రి నిర్మాణానికి 84 కోట్ల రూపాయలు విరాళాన్ని సమర్పించారు. కోటి రూపాయలకుపైగా విరాళం ఇచ్చిన దాతలకు ఉదయాస్తమాన సేవలు కేటాయించిన సంగతి తెలిసిందే.

ఇక ఈనెల 17వ తేదీన టీటీడీకి ఓ భక్తురాలు 9 కోట్ల 20 లక్షల రూపాయల విరాళం అందించారు. స్వర్గీయ డాక్టర్ ఆర్ పర్వతం జ్ఞాపకార్థం ఆమె సోదరి శ్రీమతి రేవతి విశ్వనాథం శ్రీవారి ఆలయంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఆస్తులకు సంబంధించిన పత్రాలను అందజేశారు. మరో 42 ఉదయాస్తమాన సేవ టిక్కెట్లు కోటి రూపాయలు చొప్పున విరాళం చెల్లించి కొనుగోలు చేశారు భక్తులు. ఉదయాస్తమాన సేవలు విక్రయం ద్వారా మొత్తం 550 కోట్లు రూపాయల విరాళాలు వస్తాయని టీటీడీ భావిస్తోంది.

Thirumala : తిరుమలలో రెండేళ్ల తర్వాత పెరిగిన భక్తుల రద్దీ

ఈ క్రమంలోనే మొత్తం 531 ఉదయాస్తమాన సేవ టికెట్లలో శుక్రవారపు సేవకు 29 టికెట్లు కేటాయించారు. శుక్రవారం ఉదయాస్తమాన సేవ టికెట్లను కోటిన్నర రూపాయలు విరాళాలు ఇచ్చిన దాతలకు అందజేశారు. కేవలం గంటన్నరలో 29 శుక్రవారం ఉదయాస్తమాన సేవ టిక్కెట్లు భక్తులు కొనుగోలు చేశారు.

మరోవైపు కరోనా ఆంక్షల తొలగింపుతో భక్తులు తిరుమల బాట పడుతున్నారు . వారాంతం కావడంతో తిరుమల కొండకు భక్తులు పోటెత్తారు. కొండపైకి వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగడంతో.. అలిపిరి చెక్‌పోస్టు వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. తనిఖీలు ఆలస్యం కావడంతో వాహనల సంఖ్య అంతకంతకు పెరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి తనిఖీలు వేగవంతం చేయాలని భక్తులు కోరుతున్నారు.