Gang Rape : దారుణం.. స్నేహితుడితో సముద్ర తీరానికి వెళ్లిన యువతిపై గ్యాంగ్ రేప్.. మళ్లీ కోరిక తీర్చాలని బ్లాక్ మెయిల్

నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్లు చేస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఆడపిల్లకు రక్షణ కరువైంది. నిత్యం ఏదో ఒక చోట మహిళలపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కామాంధులు బరి తెగిస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది.

Gang Rape : దారుణం.. స్నేహితుడితో సముద్ర తీరానికి వెళ్లిన యువతిపై గ్యాంగ్ రేప్.. మళ్లీ కోరిక తీర్చాలని బ్లాక్ మెయిల్

Gang Rape

Gang Rape : నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్లు చేస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఆడపిల్లకు రక్షణ కరువైంది. నిత్యం ఏదో ఒక చోట మహిళలపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కామాంధులు బరి తెగిస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది.

స్నేహితుడితో కలిసి సముద్ర తీరానికి వెళ్లిన ఓ యువతిపై మద్యం మత్తులో ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి(21) 15 రోజుల కిందట అల్లవరంలోని తమ బంధువుల ఇంట్లో శుభకార్యానికి వచ్చింది. ఆ సందర్భంగా స్నేహితుడితో కలిసి కొమరగిరిపట్నం కడదరి ప్రాంతంలో సముద్ర తీరానికి వెళ్లింది.

కాగా, మద్యం తాగి అప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న సీతారామపురానికి చెందిన ఇద్దరు యువకులు, సత్యనారాయణపురానికి చెందిన మరో వ్యక్తి వారి వద్దకు వచ్చారు. స్నేహితుడిని బంధించారు. అతడి ముందే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత నగ్నంగా ఉండగా యువతి ఫొటోలు తీశారు. పది రోజుల తర్వాత వారిలో ఓ వ్యక్తి మళ్లీ తన కోరిక తీర్చాలని, లేదంటే నగ్నచిత్రాలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు.

దాంతో బాధితురాలు బంధువులకు చెప్పడంతో వారు బుధవారం(మే 12,2021) అల్లవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఆడపిల్లల తల్లిదండ్రులను ఉలిక్కిపడేలా చేసింది. వారి భద్రత గురించి ఆందోళన చెందుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయిన దురాఘాతానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.