భారత్ చేరుకున్న రెండో బ్యాచ్ రాఫెల్ జెట్స్

  • Published By: venkaiahnaidu ,Published On : November 5, 2020 / 07:26 AM IST
భారత్ చేరుకున్న రెండో బ్యాచ్ రాఫెల్ జెట్స్

Second Batch Of Rafale Jets Arrives రెండో విడతలో భాగంగా ఫ్రాన్స్​ నుంచి మరో మూడు రాఫేల్​ యుద్ధవిమానాలు భారత్​కు చేరుకున్నాయి. ఫ్రాన్స్ నుంచి నాన్ స్టాప్ గా ప్రయాణం చేసి గురువారం రాత్రి 8:14 గంటలకు భారత్ భూభాగంపై ల్యాండ్ అయ్యాయి. ఫ్రాన్స్ నుంచి నేరుగా ఈ విమానాలు గుజరాత్ లోని జామ్ నగర్ ఎయిర్ బేస్ కు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్బంగా ఎయిర్ బేస్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.



ఫ్రాన్స్ నుంచి నాన్-స్టాప్ ఎగురుతూ 7000-బేసి కిలోమీటర్లను ఈ జెట్స్ కవర్ చేశాయని ఐఏఎఫ్ తెలిపింది. ఫ్రాన్స్ నుంచి భారత్ చేరడానికి ఈ జెట్స్ కి 8గంటల సమయం పట్టింది. మార్గమధ్యలోనే ఈ జెట్స్ గాలిలోనే ఇంధనం నింపుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో మొత్తంగా ఇప్పటివరకు 8 రఫేల్ యుద్ధ విమానాలు భారత అమ్ములపొదిలో చేరాయి. కాగా, ఈ ఏడాది జులైలో మొదటి విడతలో భాగంగా ఫ్రాన్స్ నుంచి 5 రఫేల్ యుద్ధ విమానాలు భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. బుధవారం(నవంబర్-4,2020) రెండో బ్యాచ్‌ లో భాగంగా 3 రాఫెల్‌ యుద్ధ విమానాలు భారత్‌ కు చేరాయి.



మరోవైపు, ఇప్పటికే భారత్..అత్యధునిక యుద్ధ విమానాలు రాఫెల్స్‌ను కూడా రక్షణ కోసం సరిహద్దులోకి మోహరించింది. సరిహద్దుల్లో చైనా, పాకిస్తాన్‌ ఏమాత్రం వక్రబుద్ధి చూపించినా.. తగిన బుద్ధి చెప్పేందుకు, వారి ఆట కట్టించేందుకు భారత ఆర్మీ, భారత వాయుసేన ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాఫెల్స్‌ రెండో బ్యాచ్‌ భారత్‌కు చేరుకోవడంతో చైనా, పాకిస్థాన్‌లకు దడపుడుతోంది.



గగనతంలో వేగంగా ప్రయాణిస్తూ, భూమ్మీదున్న టార్గెట్లను కచ్చితంగా ఛేదించడం, ఎయిర్ టు ఎయిర్ ఫైట్ లోనూ దీటుగా వ్యవహరించడం, దీర్ఘ శ్రేణి రాకెట్లను కూడా మోసుకెళ్లే సామర్థ్యం తదితర ప్రత్యేకతలు రాఫెల్ సొంతం.
https://10tv.in/britain-wife-slaps-anti-masker-husband-on-easy-jet-flight-in-manchester/
మరోవైపు, ఆత్యాధునిక 36 రాఫెల్స్‌ను రూ.59,000 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసేందుకు భారత్-‌ఫ్రాన్స్‌ మధ్య 2016లో ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. 2023 నాటికి ఐఏఎఫ్‌లో మొత్తం 36 రాఫెల్స్‌ చేరుతాయని చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ ఆర్‌కేఎస్ భదౌరియా ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాల్లో 18ని అంబాలా ఎయిర్‌బేస్‌లో, మరో 18ని భూటాన్ సరిహద్దులోని హసీమారా వైమానిక స్థావరంలో మోహరించనున్నారు.