రియల్ ఎస్టేట్ వ్యాపారితో వెళ్ళిపోయిన ఇంటర్ చదివే బాలిక

రియల్ ఎస్టేట్ వ్యాపారితో వెళ్ళిపోయిన ఇంటర్ చదివే బాలిక

18 years girl fled with realtor in Kuntloor : రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం కుంట్లూరు కు చెందిన ఇంటర్మీడియేట్ చదివే బాలిక స్ధానికంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారితో వెళ్లిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.కుంట్లూరు లో నివాసం ఉండే బాలిక(18) హయత్ నగర్ లోని ఒక జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియేట్ చదువుతోంది.

ఇంట్లో పెద్దలు ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కుటుంబ సభ్యులు చూసే సంబంధం చేసుకోవటం ఆమెకు ఇష్టంలేదు. ఇప్పటికే బాలిక రియల్ ఎస్టేట్ వ్యాపారితో సన్నిహితంగా ఉండటంవల్ల గర్భం దాల్చానని చెప్పి లేఖ రాసి పెట్టి ఇంట్లోంచి వెళ్లిపోయింది.

లేఖ చూసిన కుటుంబ సభ్యులు ఫిబ్రవరి 18నే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక స్ధానికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే పి.యాదయ్య కారులో వెళ్ళటం చూసినట్లు స్దానికులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదులో వివరించారు. 10 రోజులైనా బాలిక ఆచూకి తెలియకపోవటంతో కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
letter