2లక్షల మద్యం బాటిళ్లు మాయం, సిట్ విచారణకు ప్రభుత్వం ఆదేశం

హర్యానాలో లాక్ డౌన్ వేళ భారీగా మద్యం బాటిళ్లు మాయం కావడం సంచలనంగా మారింది. ఏకంగా 2లక్షల

  • Published By: naveen ,Published On : May 7, 2020 / 09:49 AM IST
2లక్షల మద్యం బాటిళ్లు మాయం, సిట్ విచారణకు ప్రభుత్వం ఆదేశం

హర్యానాలో లాక్ డౌన్ వేళ భారీగా మద్యం బాటిళ్లు మాయం కావడం సంచలనంగా మారింది. ఏకంగా 2లక్షల

హర్యానాలో లాక్ డౌన్ వేళ భారీగా మద్యం బాటిళ్లు మాయం కావడం సంచలనంగా మారింది. ఏకంగా 2లక్షల మద్యం బాటిళ్లు మాయం అయ్యాయి. సోనిపట్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీని కోసం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాఫ్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వ్యవహారాన్ని అంత తేలిగ్గా వదిలేది లేదని హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ చెప్పారు. దీని వెనుక ఉన్న వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు.

లాక్ డౌన్ లో మద్యం షాపులు మూసివేయడంతో ఓ గోడౌన్ లో మద్యం బాటిళ్లు స్టాక్ ఉంచారు. ఆ గోడౌన్ లోనే ఈ చోరీ జరిగింది. ఈ విషయాన్ని మే 5న డీజీపీ తన దృష్టికి తెచ్చారని హోంమంత్రి చెప్పారు. ఇది చాలా తీవ్రమైన విషయం అన్నారు. విధుల్లో ఉన్న సిబ్బంది ప్రమేయం లేకుండా ఇలాంటి ఘటనలు జరగవన్నారు. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించినట్టు చెప్పారు. లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి మే 5వ తేదీ వరకు హర్యానా రాష్ట్రంలో ఎక్కడా మద్యం విక్రయాలు జరగలేదు. లాక్ డౌన్ 3వ దశలో కేంద్రం కొన్ని సడలింపులు ఇవ్వడంతో హర్యానా రాష్ట్రంలో మే 6వ తేదీన మద్యం షాపులు తెరుచుకున్నాయి. దీంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది.

దీని వెనుక లిక్కర్ మాఫియా హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఎక్సైజ్, పోలీసు సిబ్బందిని ప్రభావితం చేసి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం నియమించిన కమిటీలో ముగ్గురు సభ్యులు ఉన్నారు. ఒకరు ఐఏఎస్. ఒకరు ఏడీజీపీ ర్యాంకు ఆఫీసర్. మరొకరు ఎక్సైజ్ శాఖ నుంచి సీనియర్ అధికారి. త్రిసభ్య కమిటీ వెంటనే రంగంలోకి దిగి విచారణ ప్రారంభించింది. దీనిపై 20 రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిటీని హోంమంత్రి ఆదేశించారు. కాగా, ఎక్సైజ్ శాఖను సీఎం దుశ్యంత్ చౌతాలా పర్యవేక్షిస్తున్నారు. దీనిపై మీడియా ఆయన స్పందన కోరింది. మద్యం బాటిళ్ల మాయంపై హోంమంత్రి విచారణకు ఆదేశించారని సీఎం వెల్లడించారు.

Also Read | లాక్ డౌన్ ఎఫెక్ట్…ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు ఏడాది పొడిగింపు