ఇంటిపై ఆడుకుంటున్న చిన్నారులకు విద్యుత్ షాక్ : ఒకరి మృతి

వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తో చిన్నారి మృతి చెందాడు.

  • Published By: veegamteam ,Published On : December 8, 2019 / 12:23 PM IST
ఇంటిపై ఆడుకుంటున్న చిన్నారులకు విద్యుత్ షాక్ : ఒకరి మృతి

వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తో చిన్నారి మృతి చెందాడు.

వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తో చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటన పరిగి మండలం బాహర్ పేటలో చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులు ఇంటిపై ఆడుకుంటూ పతంగి ఎగరవేస్తుండగా  విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. 

బాహర్ పేటలో 10, 11 సంవత్సరాల వయస్సు ఉన్న జహీర్, షమీ అనే ఇద్దరు చిన్నారులు బిల్డింగ్ పై ఆడుకుంటూ పతంగి ఎగరవేస్తున్న సమయంలో పక్కనున్న హైటెన్ష్ వైర్లపై పతంగి పడింది. ఇద్దరు చిన్నారులు పతంగిని తీసే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా ఇద్దరికి విద్యుత్ షాక్ తగిలింది. జహీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. షమీకి తీవ్ర గాయాలు అయ్యాయి. మెరుగైన చికిత్స కోసం అతన్ని హైదరాబాద్ కు తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

హైటెన్షన్ వైర్లపై పడిన పతంగిని రాడ్ తో తీసే ప్రయత్నం చేయడంతోనే విద్యుత్ షాక్ తగిలినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. హైటెన్షన్ వైర్లు పవర్ తో లాగేసినప్పుడు ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. పతంగి హైటెన్షన్ వైర్లకు తట్టిన సమయంలో ఐరన్ రాడ్ తో పతంగిని తీసే ప్రయత్నం చేయగా వెంటనే విద్యుత్ షాక్ కు గురై ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. 

చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపిస్తున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.