నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అదుపులోకి వచ్చిన మంటలు 

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఫైర్ సిబ్బంది మూడు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.

  • Published By: veegamteam ,Published On : January 30, 2019 / 06:42 PM IST
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అదుపులోకి వచ్చిన మంటలు 

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఫైర్ సిబ్బంది మూడు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.

హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. స్టాల్స్‌కు మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సందర్శకులు భయంతో పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. 20 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఫైర్ సిబ్బంది మూడు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. ప్రాణ నష్టం లేకపోవడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఎగ్జిబిషన్ లోని నుమాయిష్ చూసేందుకు వచ్చిన సందర్శకులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మెట్రో రైలులో టికెట్ లేకుండా ప్రయాణానికి అనుమతి ఇచ్చారు.