నందిగామలో ఘోర రోడ్డు ప్రమాదం : లారీని ఢీకొట్టిన కారు…నలుగురు మృతి

కృష్ణా జిల్లాలోని నందిగామలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

  • Published By: veegamteam ,Published On : December 5, 2019 / 12:05 PM IST
నందిగామలో ఘోర రోడ్డు ప్రమాదం : లారీని ఢీకొట్టిన కారు…నలుగురు మృతి

కృష్ణా జిల్లాలోని నందిగామలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

కృష్ణా జిల్లాలోని నందిగామలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతనికి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. 

ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. అంబర్ పేట దగ్గర జాతీయ రాహదారిపై లారీని వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. మృతులు నందిగామలోని విజయటాకీస్ సెంటర్ కు చెందిన వాసులగా గుర్తించారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.