వైట్నర్ సేవించి మత్తులో మహిళలు బీభత్సం : పోలీసులపై రాళ్ల దాడి

  • Published By: veegamteam ,Published On : May 5, 2019 / 07:01 AM IST
వైట్నర్ సేవించి మత్తులో మహిళలు బీభత్సం : పోలీసులపై రాళ్ల దాడి

హైదరాబాద్ ఫలక్ నుమా జైతుల్ మదీన కాలనీలో అర్ధరాత్రి నలుగురు మహిళలు హల్ చల్ చేశారు. వైట్నర్ సేవించిన నలుగురు మహిళలు మత్తులో తూగుతూ బీభత్స సృష్టించారు. ఎదురుగా వచ్చిన వారిపై దాడికి పాల్పడ్డారు. అడ్డుకోవడానికి వచ్చిన పోలీసులను దుర్భాషలాడుతూ రాళ్లతో దాడి చేసి నానా హంగామా చేశారు. 

నాలుగు రోజులుగా మహిళలు వైట్నర్ సేవించి మత్తులో తూగుతున్నారన్న సమాచారంతో ఫలక్ నుమాలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రాత్రి పూట వైటర్న్ సేవించి హంగామా చేస్తున్న నలుగురు మహిళలను అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. వైట్నర్ పై ప్రత్యేక దర్యాప్తు నిర్వహిస్తామని చెబుతున్నారు పోలీసులు. వైట్నర్ బాధితులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు.

శనివారం (మే 4, 2019) రాత్రి 8 గంటలకు ఘోరిబీ అనే మహిళ ఈ నలుగురు మహిళలపై ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. వైట్నర్ సేవించి గొడవ చేస్తున్నారని ఫిర్యాదులో తెలిపిందని చెప్పారు. ఆటోలపై చెప్పులు విసరడం, ట్రాఫిక్ ను ఆపడం, పోలీసులను బూతులు తిట్టారని, వారిపై కేసులు నమోదు చేశామని, చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.