తాగివచ్చి వేధిస్తున్న మనవడికి నిప్పుంటించిన అమ్ముమ్మ

  • Published By: murthy ,Published On : July 7, 2020 / 10:54 AM IST
తాగివచ్చి వేధిస్తున్న మనవడికి నిప్పుంటించిన అమ్ముమ్మ

రోజూ తాగొచ్చి వేధిస్తున్న మనవడిపై కిరసనాయిల్ పోసి నిప్పంటించిన అమ్మమ్మ ఉదంతం హైదరాబాద్ లో వెలుగు చూసింది. రంగారెడ్డి జిల్లీ మీర్ పేట పోలీసు స్టేషన్ పరిధిలోని హుడా కాలనీలో ఉండే కృష్ణ(40) కూలి పని చేస్తూ ఉంటాడు. ఇతనికి భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు. రోజు తాగి వచ్చి భార్యను వేధిస్తుంటే, భార్య పిల్లలను తీసుకుని నాలుగేళ్ల క్రితం ఇతడ్ని విడిచి పెట్టి వెళ్లి పోయింది.

అప్పటి నుంచి కృష్ణ తన అమ్మమ్మ వెంకమ్మ(75) దగ్గర ఉంటున్నాడు. తన తాగుడు కారణంగా భార్య పిల్లలు విడిచి పెట్టి వెళ్లిపోయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. రోజూ తాగివచ్చి అమ్మమ్మను కొట్టడం, తిట్టటం చేస్తూ ఆమె వద్ద ఉన్న డబ్బులు కూడా లాక్కునే వాడు. ఆ డబ్బులుతో మళ్లీ వెళ్లి తాగేవాడు. కృష్ణ వ్యవహారంతో అతడి అక్కచెల్లెళ్లు కూడా మందలించారు. అయినా అతడిలో మార్పు రాలేదు.

మనవడితో విసిగిపోయిన వెంకమ్మ ఆదివారం రాత్రి తాగి వచ్చి గొడవ చేస్తున్న మనవడిని మనవరాళ్ళ సహయంతో కట్టేసి అతడిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. తీవ్ర గాయాలైన కృష్ణ ను ఉస్మానియా అస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.