భార్య, కుమారుడిపై హత్యాయత్నం… అనంతరం తానూ ఆత్మహత్య

  • Published By: veegamteam ,Published On : April 20, 2019 / 07:49 AM IST
భార్య, కుమారుడిపై హత్యాయత్నం… అనంతరం తానూ ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లా ముత్తంగిలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో భార్య, కుమారిడిపై భర్త హత్యాయత్నం చేశాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు మృతి చెందాడు. భార్య పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగార్జున కాలనీలో నివాసముంటున్న సుబ్బారావుకు అంతకముందే పెళ్లి అయింది. భార్య నుంచి వేరుపడ్డాడు. స్థానికంగా ఉన్న ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈక్రమంలో కంపెనీ దగ్గర ఉంటున్న మరో మహిళ లక్మీబాయితో సంబంధం ఏర్పరచుకుని.. ఆమెను వివాహం చేసుకున్నాడు. అప్పటికే ఆమెకు పదేళ్ల కుమారుడు ఉన్నాడు.

కొంతకాలంగా భార్యభర్తల మధ్య కుటుంబ కలహాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో శుక్రవారం (ఏప్రిల్ 19,2019) రాత్రి 11.30 గంటల సమయంలో భార్య లక్ష్మీబాయి, కుమారుడు చైతన్యపై సుబ్బారావు వేట కొడవలితో దాడి చేసి హత్యాయత్నం చేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.