అడ్డంగా బుక్కయ్యాడు : బంగారాన్ని ఒంటికి పూతలా పూసి స్మగ్లింగ్

  • Published By: sreehari ,Published On : October 25, 2019 / 12:04 PM IST
అడ్డంగా బుక్కయ్యాడు : బంగారాన్ని ఒంటికి పూతలా పూసి స్మగ్లింగ్

బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు ఒక్కొక్కరూ విభిన్నంగా ప్రయత్నిస్తుంటారు. బంగారాన్ని స్మగ్లింగ్ చేసే క్రమంలో కస్టమ్ అధికారుల కళ్లుగప్పి తప్పించుకోబోయి అడ్డంగా దొరికిపోతున్నారు. దుబాయ్ నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించి పట్టుబడ్డాడు.

దుబాయ్ నుంచి లక్నోకు బయల్దేరిన IX 194 విమానంలో ప్రయాణిస్తున్న వ్యక్తిని కస్టమ్ అధికారులు ఉత్తరప్రదేశ్ లోని చౌదరీ చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. 542 గ్రాముల విలువైన బంగారాన్ని లిక్విడ్ రూపంలో ఉంచి ఆ మిశ్రమాన్ని అంతా తన శరీరం వెనుక భాగాన పూతలా పూసుకున్నాడు.

దీని విలువ రూ.21లక్షల 46వేల 320 ఉంటుందని అధికారులు అంచనా. బంగారాన్ని ఎయిర్ పోర్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తి, ఎవరూ ఎక్కడి నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తాడు అనేదానిపై అధికారులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.