Viral Video : ఘోర ప్రమాదం.. బస్సులోంచి జారిపడ్డ యువతి, అక్కడికక్కడే మృతి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

Viral Video : ప్రైవేట్ బస్సు ప్రయాణికులతో రద్దీగా ఉంది. బస్సులో ఖాళీ లేకపోవడంతో యువతి బస్సు డోర్ దగ్గరే ఫుట్ బోర్డుపై నిల్చుంది.

Viral Video : ఘోర ప్రమాదం.. బస్సులోంచి జారిపడ్డ యువతి, అక్కడికక్కడే మృతి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

Viral Video(Photo : Twitter)

Viral Video : తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బస్సులోంచి యువతి జారిపోయి రోడ్డు మీద పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ యువతి స్పాట్ లోనే చనిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యువతి బస్సులోంచి జారిపడ్డ దృశ్యాలు వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఉన్నాయి.

సేలం జిల్లాలో ఈ ఘోరం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు ప్రయాణికులతో రద్దీగా ఉంది. బస్సులో ఖాళీ లేకపోవడంతో ఓ యువతి బస్సు డోర్ దగ్గరే ఫుట్ బోర్డుపై నిల్చుంది. అదే తన పాలిట మృత్యువు అవుతుందని ఆ యువతి ఊహించలేకపోయింది. బస్సు డ్రైవర్ అతివేగం కూడా యువతి ప్రాణం పోవడానికి కారణమైంది.(Viral Video)

Also Read..Spiderman Thief : ఓ మై గాడ్.. స్పైడర్ మ్యాన్‌లా నిమిషంలోపే నాలుగంతస్తుల బిల్డింగ్ ఎక్కేసిన దొంగ.. వీడియో వైరల్

డ్రైవర్ బస్సుని చాలా వేగంగా పోనిచ్చాడు. ఈ క్రమంలో ఓ దగ్గర మలుపు వచ్చింది. డ్రైవర్ బస్సుని అంతే వేగంతో పోనిచ్చాడు. అంతే, డోర్ దగ్గర ఫుట్ బోర్డుపై ఉన్న యువతి పట్టు కోల్పోయింది. ఒక్కసారిగా అమాంతం బస్సులోంచి జారి రోడ్డుపై పడింది. బస్సులోంచి చాలా దూరంగా వెళ్లి పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

వెంటనే స్థానికులు యువతి దగ్గరికి పరుగులు తీశారు. యువతిని కాపాడాలని చూశారు. కానీ, అప్పటికే ఘోరం జరిగిపోయింది. ఆమె విగతజీవిగా కనిపించింది. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ యాక్సిడెంట్ చాలా షాకింగ్ గా ఉంది. యువతి నిర్లక్ష్యం, బస్సు డ్రైవర్ అతివేగం.. ఓ నిండు ప్రాణం పోవడానికి కారణమయ్యాయి. బస్సు డ్రైవర్ చాలా వేగంగా నడిపాడు. ముందుర మలుపు ఉన్న విషయం తెలిసినా.. వేగం మాత్రం తగ్గించలేదు. ఈ క్రమంలో యువతి పట్టుతప్పి బస్సులోంచి జారిపడింది.(Viral Video)

Also Read..Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు దుర్మరణం.. ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్ వీడియో

మృతురాలిని కౌసల్యగా(20) పోలీసులు గుర్తించారు. నమ్మక్కల్ జిల్లా రసిపురంలో నివాసం ఉంటుంది. అట్టియంపట్టిలో గార్మెంట్ కంపెనీలో ఆమె పని చేస్తుంది. బుధవారం సాయంత్రం డ్యూటీ అయిపోయాక ఇంటికి వెళ్లేందుకు కౌసల్య 6గంటల సమయంలో ప్రైవేట్ బస్సు ఎక్కింది. అయితే, అప్పటికే బస్సులో చాలా రద్దీగా ఉంది. లోపలికి వెళ్లే అవకాశం కూడా లేదు. చీకటిపడిపోతే ఇబ్బంది అవుతుందని భావించిన కౌసల్య.. మరోదారి లేక.. ఆ బస్సే ఎక్కింది.

ఫుట్ బోర్డుపైనే నిల్చుంది. చంద్రా థియేటర్ దగ్గర మలుపు వచ్చింది. బస్సు వేగంగా పోవడంతో.. కౌసల్య పట్టు కోల్పోయింది. ఫుట్ బోర్డు నుంచి జారి రోడ్డుపై పడి ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ యాక్సిడెంట్ స్థానికులను, బస్సులోని ప్రయాణికులను షాక్ కి గురి చేసింది. బస్సు డోర్ దగ్గర, ఫుట్ బోర్డుపై నిలబడి ప్రయాణం చేయడం చాలా ప్రమాదకరం. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాణాలే పోతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.(Viral Video)