Rajasthan : భార్యపై అనుమానం-చెట్టుకు కట్టేసి కొట్టిన భర్త.. అతని కుటుంబ సభ్యులు

భార్యపై అనుమానం పెంచుకున్న భర్త, అతని తరుఫు బంధువులు ఆమెను చెట్టుకు కట్టేసి  కొట్టిన దారుణ సంఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది.

Rajasthan : భార్యపై అనుమానం-చెట్టుకు కట్టేసి కొట్టిన భర్త.. అతని కుటుంబ సభ్యులు

Rajasthan Woman Tied

Rajasthan :  భార్యపై అనుమానం పెంచుకున్న భర్త, అతని తరుఫు బంధువులు ఆమెను చెట్టుకు కట్టేసి  కొట్టిన దారుణ సంఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవటంతో ఘటన జరిగిన నాలుగు రోజుల  తర్వాత పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

రాజస్థాన్ లోని   బన్స్వారా జిల్లాలోని ఖమేరా పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే వివాహిత మహిళ తన అత్తను  చూడటానికి ప్రక్క గ్రామానికి వెళ్లింది. ఆ గ్రామంలో  ఆటో నడుపుకునే, తనకు తెలిసిన స్ధానిక వ్యక్తి  ఆటోలో  అత్తగారింటి దగ్గర దింపమని కోరింది.  అతడు ఆమెను అత్తగారి ఇంటి వద్ద  ఆటోలో  దింపాడు. దీన్ని చూసిన ఆమె అత్త ఆటో నడుపుతున్నవ్యక్తితో ఆమెకు సంబంధం ఉన్నట్లు భర్తకు చెప్పింది.

అది నమ్మిన భర్త, ఆమె తరుపు బంధువులు మహిళను చెట్టుకు కట్టేసి దాదాపు 7 గంటల  పాటు కొట్టారు. ఆమె తప్పేమి చేయలేదని చెపుతున్నా వినకుండా .. నొప్పులు భరించలేక పోతున్నా  అని  మొర పెట్టుకున్నా ఎవరూ కనికరించకుండా కొట్టారు.  ఆమెకు తెలిసిన  ఆటోడ్రైవర్ ను  కూడా చెట్టుకు కట్టేసి ఇదే రకంగా కొట్టారు.

ఈ తంతంగం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈఘటనను సీరియస్ గా తీసుకున్నజాతీయ మహిళా కమీషన్ రాజస్థాన్ డీజీపీకి లేఖ రాసింది. దీనికి బాధ్యులైన నిందితులందరినీ వెంటనే అరెస్టు చేయాలని…బాధితురాలికి ఉత్తమ వైద్యం మరియు భద్రత కల్పించాలని జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ రాష్ట్ర అధికారులను కోరారు. రంగంలోకి దిగిన పోలీసులు శనివారం ఆమె భర్తతో సహా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు.