పోలీసులమని బెదిరించి బస్సులో మహిళపై అత్యాచారం

జహీరాబాద్ లో ఘోరం జరిగింది. పోలీసులమని చెప్పిన దుండగులు మహిళపై అత్యాచారం చేశారు. బస్సులో వెళ్తున్న మహిళను బలవంతంగా కిందకి దించి నిర్మానుష్య ప్రాంతానికి

  • Published By: veegamteam ,Published On : February 11, 2020 / 01:22 PM IST
పోలీసులమని బెదిరించి బస్సులో మహిళపై అత్యాచారం

జహీరాబాద్ లో ఘోరం జరిగింది. పోలీసులమని చెప్పిన దుండగులు మహిళపై అత్యాచారం చేశారు. బస్సులో వెళ్తున్న మహిళను బలవంతంగా కిందకి దించి నిర్మానుష్య ప్రాంతానికి

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఘోరం జరిగింది. పోలీసులమని చెప్పిన దుండగులు మహిళపై అత్యాచారం చేశారు. బస్సులో వెళ్తున్న మహిళను బలవంతంగా కిందకి దించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమె బ్యాగ్ తో పారిపోయారు. మేము పోలీసులం అని చెప్పి బస్సులోకి ఎక్కిన దుండగులు.. మహిళ బ్యాగులో అనుమానాస్పన వస్తువులు ఉన్నాయని బెదిరించారు. ఆ తర్వాత ఆమెని బస్సు నుంచి కిందకి తీసుకెళ్లారు. నిర్మానుష్య ప్రాంతంలో అఘాయిత్యానికి ఒడిగట్టారు.

జహీరాబాద్ నుంచి సూర్యాపేట వెళ్తున్న బస్సులో ఈ ఘటన జరిగింది. మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. దుండగుల కోసం గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. 

పోలీసులం అని చెప్పిన దుండగులు మహిళపై అఘాయిత్యానికి ఒడిగట్టడం సంచలనంగా మారింది. బస్సులోని తోటి ప్రయాణికులను, స్థానికులను షాక్ కు గురి చేసింది. అసలు వాళ్లు ఎవరు? పోలీసులం అని ఎందుకు చెప్పుకున్నారు? ఆ మహిళనే ఎందుకు బెదిరించారు? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాఫ్తుని ముమ్మరం చేశారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని, మిస్టరీని చేధిస్తామని అన్నారు.

* సంగారెడ్డి జిల్లాలో దారుణం
* పోలీసులమని బెదిరించి మహిళపై అత్యాచారం
* బస్సులోంచి ప్రయాణికురాలిని దింపి అత్యాచారం చేసిన దుండగులు
* బ్యాగులో అనుమానాస్పద వస్తువులు ఉన్నాయని మహిళకు బెదిరింపులు

1

* నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యం
* మహిళ లగేజ్ తో పరారీ
* బాధితురాలి ఫిర్యాదుతో పోలీసుల దర్యాఫ్తు
* నిందితుల కోసం సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్న పోలీసులు
* నిందితుల కోసం గాలిస్తున్న ప్రత్యేక బృందాలు