Parking Fee : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అడ్డగోలు దోపిడీ..అరగంటకు పార్కింగ్ ఫీజు రూ.500 వసూలు
ఓ వ్యక్తి తన కారును రైల్వే స్టేషన్ లో కేవలం అర గంట పార్క్ చేసినందుకు ఏకంగా 500 ఫీజ్ వసూలు చేశారు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగింది.
Secunderabad railway station : బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పార్కింగ్ ఫీజు ఎంత ఉంటుంది.. మహా అయితే.. గంటకు 10 రూపాయలుంటుంది. అంతకు మించి అంటే.. 20 లేదా 50 రూపాయలుంటుంది. కానీ… ఓ వ్యక్తి తన కారును రైల్వే స్టేషన్ లో కేవలం అర గంటల పార్క్ చేసినందుకు ఏకంగా 500 ఫీజ్ వసూలు చేశారు. దీంతో రైల్వే స్టేషన్లు కూడా ప్రైవేటీకరణ చేశారా.. అంటూ బాధితుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.
పార్కింగ్ ఫీజ్ కు సంబంధించిన టికెట్ను సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. మంత్రి కేటీఆర్కు ట్యాగ్ చేశారు. దీనిపై కేటీఆర్ స్పందించారు. కేంద్ర రైల్వే మంత్రిని ట్యాగ్ చేస్తూ.. ఈ సంఘటనను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగింది.
హైదరాబాద్కు చెందిన రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఏకే జైరథ్ ఈ నెల 4వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లారు. అక్కడున్న పార్కింగ్ ప్లేస్లో తన వాహనాన్ని పార్క్ చేశారు. తన పని పూర్తయిన అనంతరం తిగిరి పార్కింగ్కు చేరుకున్నాడు. తనకు ఇచ్చిన పార్కింగ్ ఫీజును చూసి ఆర్మీ ఆఫీసర్ షాక్ అయ్యాడు.
కేవలం 31 నిమిషాలకు 500 ఛార్జ్ వేయడంతో… ఇంత ఎందుకంటూ ప్రశ్నించారు. అయినా… పార్కింగ్ నిర్వాహకులు ఆయన మాటలు ఏ మాత్రం వినిపించుకోకుండా 500 వసూలు చేశారు. పార్కింగ్ ఫీజు 423 రూపాయల 73 పైసలు.. సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ కింద 38రూపాయల 14 పైసలు చొప్పున వసూలు చేశారు.
Mariamma Lockup Death : గుండె ఆగిపోయేలా కొడతారా?..మరియమ్మ లాకప్ డెత్ పై హైకోర్టు సీరియస్
పార్కింగ్ నిర్వాహకులతో వాదించినప్పటికీ లాభం లేకుండా పోయింది. దీంతో చేసేదేమీ లేక బాధితుడు తనకు జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కేవలం 31 నిమిషాలకు పార్కింగ్ ఫీజు 500 వసూలు చేయడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. ఇది దారుణమని వ్యాఖ్యానించారు. చర్యలు తీసుకోవాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు.