Rahul Gandhi: ఉద్యోగాలు లేవు కానీ ట్యాక్సులు మాత్రం ఎక్కువ.. కేంద్రంపై రాహుల్ విమర్శలు
గతంలో ఆహారోత్పత్తులపై జీఎస్టీ ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉంది అని సూచించే టేబుల్ను ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ టేబుల్లో హాస్పిటల్ రూమ్స్, హోటల్ రూమ్స్, సోలార్ హీటర్స్, ఎల్ఈడీ ల్యాంప్స్పై జీఎస్టీ ఎలా పెరిగిందో పేర్కొన్నారు.
Rahul Gandhi: ఆహార ధరలపై జీఎస్టీ విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఆర్థిక వ్యవస్థను బీజేపీ ధ్వంసం చేస్తోందన్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘‘ట్యాక్సులు అధికం.. జాబ్స్ శూన్యం. ఒకప్పుడు ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్న దేశాన్ని నాశనం చేయడంలో బీజేపీది మాస్టర్ క్లాస్ పనితీరు’’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.
Gyanvapi Masjid: జ్ఞానవాపి మసీదులో శివలింగానికి పూజలు.. 21న సుప్రీంకోర్టులో విచారణ
గతంలో ఆహారోత్పత్తులపై జీఎస్టీ ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉంది అని సూచించే టేబుల్ను ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ టేబుల్లో హాస్పిటల్ రూమ్స్, హోటల్ రూమ్స్, సోలార్ హీటర్స్, ఎల్ఈడీ ల్యాంప్స్పై జీఎస్టీ ఎలా పెరిగిందో పేర్కొన్నారు. మరోవైపు బీజేపీకి చెందిన ఎంపీ.. రాహుల్ గాంధీకి వరుసకు సోదరుడయ్యే వరుణ్ గాంధీ కూడా కేంద్ర నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఆయన కూడా జీఎస్టీకి వ్యతిరేకంగా ట్వీట్ చేశారు. ‘‘ఈ రోజు నుంచి పాలు, పెరుగు, బియ్యం, పప్పులు, లస్సీ, బ్రెడ్ వంటివాటిపై జీఎస్టీ వర్తిస్తుంది. ఒకపక్క రికార్డు స్థాయిలో నిరుద్యోగం పెరిగిపోతున్న దశలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.
Vijayendra Prasad: రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన విజయేంద్ర ప్రసాద్
మధ్యతరగతి జేబులు ఖాళీ అవుతాయి. ముఖ్యంగా ఉపాధి లేక అద్దె ఇండ్లలో నివసిస్తున్న యువతపై ఇంకా భారం పడుతుంది. ఇలాంటి సమయంలో వాళ్లకు ఉపశమనం ఇవ్వాల్సింది పోయి, ఇంకా ఇబ్బంది పెడుతున్నాం’’ అంటూ వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు. ఆయన బీజేపీకే చెందినప్పటికీ, ప్రజా సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటారు. సొంతపార్టీపైనే విమర్శలు చేస్తుంటారు. కాగా, ఈ రోజు నుంచి అనేక ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోకి వచ్చిన సంగతి తెలిసిందే.
HIGH taxes, NO jobs
BJP’s masterclass on how to destroy what was once one of the world’s fastest growing economies. pic.twitter.com/cinP1o65lB
— Rahul Gandhi (@RahulGandhi) July 18, 2022