Christmas : దేశవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు
క్రిస్మస్ సందర్భంగా చర్చిలన్నీ అందంగా ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాల వెలుగుల్లో కనువిందు చేశాయి. రాత్రి సామూహికప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్ ట్రీలను అందంగా తయారు చేశారు.
Christmas celebrations in india : దేశ వ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. అంరగరంగ వైభవంగా జరుగుతున్నాయి. క్రిస్మస్ సెలబ్రేషన్స్ను ఘనంగా నిర్వహిస్తున్నారు. అన్ని చర్చిల్లోనూ తెల్లవారుజాము దాకా ప్రార్థనలు జరిగాయి. పలుచోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
క్రిస్మస్ సందర్భంగా చర్చిలన్నీ అందంగా ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాల వెలుగుల్లో కనువిందు చేశాయి. రాత్రి సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్ ట్రీలను అందంగా తయారు చేశారు. రంగురంగు కాగితాలు, నక్షత్రాలు, చిరుగంటలు, గాజు గోళాలతో అందంగా అలంకరించారు.
PM Modi : గురునానక్ జయంతి వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
ఇక శాంటాక్లాజ్ సందడి చేశాడు. పిల్లలతో కలిసి ఆడిపాడారు. చిన్నారులకు బహుమతులు అందజేశారు. అంతా మేరీ క్రిస్మస్ అంటూ విషెస్ చెప్పుకున్నారు. స్వీట్లు తినిపించుకున్నాడు. క్రీస్తు నామస్మరణ, ప్రత్యేక ప్రార్థనలతో చర్చిల్లో ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లోనూ క్రిస్మస్ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాత్రంగా చర్చిల్లో ప్రార్థనలు, ఆటపాటలతో సందడిగా మారాయి. క్రిస్మస్ను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.